Team India Asia Cup: భారత్ ఫైనల్ చేరాలంటే ఈ అద్భుతాలు జరగాల్సిందే
ఆసియా కప్ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరేట్...లీగ్ స్టేజ్ తర్వాత ఇక కప్ మనదే...సూపర్ 4 స్టేజ్ మొదలయ్యాక అంచనాలన్నీ తలకిందులు...
- By Naresh Kumar Published Date - 12:16 PM, Wed - 7 September 22
ఆసియా కప్ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరేట్…లీగ్ స్టేజ్ తర్వాత ఇక కప్ మనదే…సూపర్ 4 స్టేజ్ మొదలయ్యాక అంచనాలన్నీ తలకిందులు…రెండు మ్యాచ్ ల్లో ఓడి ఫైనల్ రేస్ నుంచి దాదాపుగా ఔట్…కేవలం సాంకేతికంగా మాత్రమే రేసులో ఉంది… ఇదీ టీమిండియా పరిస్థితి. శ్రీలంకతో మ్యాచ్ లో ఓటమి తర్వాత భారత్ ఫైనల్ చేరే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన టీమ్ ఫైనల్ ఛాన్స్ మిగిలిన జట్లపై ఆధారపడి ఉంది. రోహిత్ సేన ఫైనల్ రేసులో నిలవాలంటే అద్భుతాలు జరగాల్సిందే.
ఇప్పటికే రెండు విజయాలతో శ్రీలంక దాదాపుగా ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ చెరో రెండు మ్యాచులు ఆడనున్నాయి. వాటిలో ఒక్కటి గెలిచినా వాటికి కూడా ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి. సూపర్-4లో ఇవాళ అఫ్గాన్-పాక్ పోరులో విజేతను బట్టి ఈ టోర్నీలో భారత భవితవ్యం తేలిపోనుంది. నేటి మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ పాకిస్తాన్ ను ఓడిస్తేనే భారత్ రేసులో ఉంటుంది పాకిస్తాన్ గెలిస్తే రోహిత్ సేన కథ పూర్తిగా ముగుస్తుంది. గురువారం అఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో భారత్ భారీ తేడాతో ఘనవిజయం సాధిస్తే రన్ రేట్ కూడా పెరుగుతుంది. భారత్ ఫైనల్ బెర్త్ కు అదే కీలకమవుతుంది. శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ లో లంక ఓడిపోవాలి. లేకుంటే భారత్ ఇంటిదారి పట్టాల్సిందే. వీటన్నింటికీ మించి ఫైనల్ బెర్త్ కు నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషించనుంది.
ప్రస్తుతం శ్రీలంక నెట్ రన్ రేట్ +0.351గా ఉంది. రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ నెట్ రన్ రేట్.. +0.125గా ఉండగా మూడో స్థానంలో ఉన్న భారత్.. -0.125గా ఉంది. అఫ్గాన్ -0.589 తో నాలుగో స్థానంలో ఉంది. ఈ సమీకరణాలు అన్ని ఇలా జరిగితే…ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అద్భుతాలు జరిగితేనే టీమిండియా ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. అయితే గెలవాల్సిన మ్యాచ్ లలో ఓడిపోయి..ఇలా మిగిలిన జట్లపై ఆధారపడడం భారత్ లాంటి టీమ్ కు సరికాదు అన్నది కొందరి అభిప్రాయం. కానీ మన క్రికెట్ ఫాన్స్ మాత్రం ఈ అద్భుతాల పైనే ఆశలు పెట్టుకున్నారు. ఏది ఏమైనా ఇవాళ్టి పాక్ , ఆఫ్గన్ మ్యాచ్ తో టీమిండియా కథ తేలిపోనుంది.
Related News
Team India Strengths: టీ20 ప్రపంచకప్.. టీమిండియా బలాలు, బలహీనతలు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత్ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టులో రింకూ సింగ్ను తొలగించారు.