MS Dhoni: ధోనీ దెబ్బకు క్యాండీక్రష్ డౌన్లోడ్స్ విపరీతంగా పెరుగుతాయా? ఎందుకో తెలుసా.. వీడియో వైరల్
మహేంద్ర సింగ్ ధోనీ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన ట్యాబ్లో క్యాండీక్రష్ గేమ్ ఆడుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- By News Desk Published Date - 11:03 PM, Sun - 25 June 23
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కి క్రీడాభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. క్రికెట్లో మిస్టర్ ఫర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నధోనీ రియల్ లైఫ్లోనూ అలానే ఉంటాడు. అందుకే ధోనీ అంటే అన్ని వర్గాల్లో విపరీతమైన క్రేజ్. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2023 (IPL 2023) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టును విజేతగా నిలపడంలో కెప్టెన్గా ధోనీ కీలక భూమిక పోషించారు. తాజాగా ధోనీ విమానంలో ప్రయాణిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలో మహేంద్ర సింగ్ ధోనీ వద్దకు ఎయిర్ హోస్టెస్ చాక్లెట్లతో ఉన్న ట్రే పట్టుకొని వెళ్లింది. ధోనీ తన సీట్లో కూర్చొని ఏంచక్కా ట్యాబ్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నాడు. ట్రేను చూసిన ధోనీ చిరునవ్వుతో ఒక్క చాక్లెట్ తీసుకొని చాలు అన్నట్లు ఎయిర్ హోస్టెస్కు సైగ చేశాడు. ఆ సమయంలో ధోనీ క్యాండీ క్రష్ ఆడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నాయి.
ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఒక మిలియన్ మంది నెటిజన్లు వీక్షించారు. ధోనీ క్యాండీ క్రష్ ఆడుతున్నట్లు వీడియోలో ఉండటంతో.. ఇక ధోనీ దెబ్బకు క్యాండీక్రష్ డౌన్లోడ్స్ విపరీతంగా పెరుగతాయి అంటూ ఓ నెటిజన్ సరదా కామెంట్ చేశాడు. మరికొందరు నెటిజన్లు.. క్యాండిక్రష్లో ధోనీ ఏ లెవెల్ ఆడుతున్నాడో అంటూ కామెంట్లు చేశారు.
The way he winks his eyes 🥺
Also the way she is acting kittenish while having is wife right next to him 🥰What a video @msdhoni 🤩 pic.twitter.com/SkrhQeZnDE
— LEO (@BoyOfMasses) June 25, 2023
Related News
CSK vs SRH: చెపాక్ లో హైదరాబాద్ ని చిత్తుగా ఓడించిన చెన్నై
చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. 78 పరుగుల తేడాతో రుతురాజ్ సేన పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో చెన్నై 200 స్కోర్ చేయడం ద్వారా టీ20 క్రికెట్లో చెన్నై 35వ సారి 200 ప్లస్ స్కోర్ చేసింది.