YSR EBC Nestam scheme : అగ్రవర్ణ పేదలకు జగన్ స్కీం
- By Hashtag U Published Date - 01:57 PM, Tue - 25 January 22

అగ్రవర్ణ పేదలకు YSR EBC నేస్తం పేరుతో మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నేరుగా మహిళల ఖాతాలలో నగదును పంపిణీ చేసింది. మహిళల ఖాతాల్లో 589 కోట్లు జమ అయ్యాయి. ఆర్థికంగా వెనుకబడిన ఓసీల కోసం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం మొదటి విడతను సీఎం జగన్ ప్రారంభించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోలో చేర్చనప్పటికీ మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రూ.589 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు.రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, క్షత్రియ, వెలమ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు నిరుపేద మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,92,674 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.