MP Gorantla Issue: `డర్టీ పిక్చర్`పై ఆ నలుగురు
ఏపీ మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. మహిళా సమస్యలపై వెంటనే స్పందించే నైజం ఆమెది.
- By CS Rao Published Date - 01:35 PM, Fri - 5 August 22
ఏపీ మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. మహిళా సమస్యలపై వెంటనే స్పందించే నైజం ఆమెది. ఏదైనా సంఘటన జరిగితే ఫిర్యాదు లేకపోయినప్పటికీ సుమోటోగా విచారణ చేసే అధికారం చైర్ పర్సన్ హోదాలో విశేషాధికారులు ఉన్నాయి. కానీ, ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో మౌనంగా ఉన్నారు. బహుశా బాధిత మహిళ నుంచి ఫిర్యాదులేదని సైలెంట్ గా ఉన్నారనుకుందాం. ఇలాంటి సమయంలో సుమోటోగా ఆ వీడియో మీద విచారణ జరపాల్సిన బాధ్యత మహిళా చైర్ పర్సన్ గా ఆమెకు లేకపోలేదు. ఎందుకంటే, సభ్యసమాజం తలదించుకునేలా మహిళని లోబరుచుకున్న దృశ్యం అది. ఎంపీ హోదాలో ఆయన చేసిన వికృత చేష్టలపై ప్రాథమిక విచారణ చేసే మహిళా చైర్ పర్సన్ కు ఉంది. ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్నట్టు ఆ వీడియో మార్ఫింగ్ చేశారా? నిజమా? అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొచ్చు. కానీ, ఆమె సైలెంట్ గా ఉండడాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నించడమే కాకుండా ఎక్కడికి వెళ్లారని నిలదీస్తున్నారు.
ఇక మద్యం, మహిళా సమస్యలపై ముందుండి పోరాడే ఐరన్ లేడీ మంత్రి రోజా. సుదీర్ఘ పోరాటాలు మహిళల భద్రత కోసం ఉద్యమించారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ..ఇలా ఏ పార్టీలో ఉన్నప్పటికీ మహిళ సాధికరత, రక్షణ, భద్రత కోసం రోజా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ప్రతి అంశానికీ ఆమె ముందుకొస్తూ రాజకీయంగా నోరు పెద్దది చేసుకుంటారు. కానీ, ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో మౌనంగా ఉన్నారు. అదే, ప్రత్యర్థి పార్టీల లీడర్ల వీడియో అయితే, ఈ పాటికి పెద్ద నోరు చేసుకుని ముందుకొచ్చేదని నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మంత్రి హోదాలో ప్రస్తుతం ఉన్న రోజా వైసీపీ ఎంపీ మాధవ్ వీడియో చూశారా? లేదా? అనే టాక్ నడుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడి కుటుంబ వ్యవహారాలను కూడా బజారుకు తీసుకొచ్చే లక్ష్మీపార్వతి రెండు రోజుల క్రితం ఉమామహేశ్వరి ఆత్మహత్య గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకొచ్చారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో గురించి మాట్లాడేందుకు చుక్కాని వేసినా ఆమె దొరకడంలేదు.
వైసీపీకి చెందిన రోజా రాణి ఇటీవల ఆ పార్టీ తరపున ఫైర్ బ్రాండ్ గా మారారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు, అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు ప్రతిగా మీడియా ముందుకొచ్చి బూతుపురాణం వినిపించారు. మహిళలకు అండగా ఆమె నిలబడుతున్నారు. మంత్రి రోజాకు ఏ మాత్రం తీసిపోకుండా రోజారాణి ప్రత్యర్థులపై ఎగసిపడుతున్నారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో మిన్నకుండిపోయారు. ఆ పార్టీ నుంచి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మినహా ఎవరూ నోరుమెదపడంలేదు. సోషల్ మీడియా వేదికగా కూడా ఆ పార్టీ టీమ్ చీమకుట్టినట్టు ఉన్నారు. నెట్ జన్లు మాత్రం వాసిరెడ్డి, రోజా, రాణి, లక్ష్మీపార్వతి ఎక్కడున్నారు? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియోపై మహిళా ఫైర్ బ్రాండ్స్ స్పందిస్తారేమో చూద్దాం.!
Related News
Viral Video: పెంపుడు కుక్కను దారుణంగా కొట్టిన మహిళ.. వీడియో వైరల్, అలియా భట్ రియాక్షన్
Viral Video: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పెట్ లవర్ అనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కుక్కను ఓ మహిళ క్రూరంగా కొడుతున్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాంద్రాలోని ఓ వీధిలో జరిగిన ఈ ఘటనలో బీరా అనే బీగిల్ కుక్క తీవ్రంగా గాయపడింది. ఈ వీడియోను మొదట నటి సోఫీ చౌదరి పోస్ట్ చేశారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వీడియ�