Telangana Politics: తెలంగాణలో ముందస్తు గాలులు.. కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్కెచ్ ఏమిటి?
ఇక్కడ చిటికేస్తే అక్కడ సౌండ్ వస్తుంది అంటారు కదా. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత..
- By Hashtag U Published Date - 08:23 AM, Fri - 11 March 22
ఇక్కడ చిటికేస్తే అక్కడ సౌండ్ వస్తుంది అంటారు కదా. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత.. ఆ ప్రకంపనలు బీజేపీయేతర రాష్ట్రాల్లోని పార్టీలకు, ప్రభుత్వాలకు బీపీ పెంచుతున్నాయి. అసలే బీజేపీ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫుల్ గా కార్నర్ చేసింది. నిరసనలు, ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు, విమర్శలు, ఆరోపణలతో ముప్పేట దాడి చేస్తూ ఉక్కిరిబిక్కిరయ్యేలా పొగపెడుతోంది. ఇలాంటి సమయంలో ఐదు రాష్ట్రాల రిజల్ట్ తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?
తెలంగాణలో 80కి పైగా సీట్లు గెలుస్తాం.. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఓవైపు బీజేపీ పెద్ద హామీలు ఇస్తోంది. ఇదే సమయంలో ఈ గడ్డపై కమలం అడ్రస్సే గల్లంతు చేయడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ కూడా ఓ ప్లాన్ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. అందుకే రాష్ట్రంతోపాటు దేశంలోనే బీజేపీని లేకుండా చేయడానికి ఫ్రంట్ పేరుతో అడుగులు వేస్తున్నారు. కానీ అక్కడి సంగతి తరువాత.. ముందు కాళ్లకిందకు వస్తున్న నీటిని ఆపండంటూ ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్టు సమాచారం. మరి ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఎలా పనిచేయనుంది?
ఇప్పుడున్న మోదీ హవాను తట్టుకుని.. కమలం హోరులో కొట్టుకుపోకుండా ఉండాలంటే.. మరోసారి ముందస్తుకు వెళ్లడమే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈమేరకు ప్రశాంత్ కిషోర్ కూడా ఓ రిపోర్ట్ ను గులాబీ బాస్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ డిసెంబర్ లోనే అసెంబ్లీని రద్దు చేస్తారని.. బీజేపీని బూచిగా చూపించి మార్చిలో ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని పొలిటికల్ టాక్.
దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో హస్తవాసి బాగాలేకపోయినా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పాదయాత్రలతో ముందుకు దూసుకెళుతోంది. అటు బీజేపీ తన ప్రచారంలో జోరు పెంచింది. అయినా సరే.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలే తమకు శ్రీరామరక్ష అని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం పెరగడం, 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ముందుకు రావడం వంటి చర్యల వల్ల అన్ని వర్గాల్లోనూ సంతృప్తి ఉందని విశ్వసిస్తున్నాయి. అందుకే ముందస్తు వ్యూహాన్ని అనుసరిస్తే మేలని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Related News
Prashant Kishor : బీహార్లో ఫ్రంట్ ఉండదు.. బీహార్ ఎన్నికలపై పీకే కీలక వ్యాఖ్యలు
దేశంలో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల వాతావరణం నెలకొంది. నాలుగు దశల్లో పోలింగ్ జరిగింది.