Congress: జీ23 Vs కాంగ్రెస్.. పొలిటికల్ వార్ గెలిచేదెవరు?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురవ్వడంతో పార్టీలో అసమ్మతి వర్గానికి బలం చేకూరింది. అందుకే జీ-23 లీడర్లు ఇప్పటికే గులాంనబీ ఆజాద్ ఇంట్లో సమావేశం కూడా అయ్యారు.
- By Hashtag U Published Date - 10:07 AM, Fri - 18 March 22
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురవ్వడంతో పార్టీలో అసమ్మతి వర్గానికి బలం చేకూరింది. అందుకే జీ-23 లీడర్లు ఇప్పటికే గులాంనబీ ఆజాద్ ఇంట్లో సమావేశం కూడా అయ్యారు. కాంగ్రెస్ పరాజయం తరువాత వాళ్లు సమావేశం కావడం అదే తొలిసారి కావడంతో అందరి దృష్టీ వారిపైనే ఉంది. మొత్తానికి వాళ్లేం చేయాలనుకున్నారో అదే చెప్పారు. కానీ కాంగ్రెస్ లాంటి పార్టీలో.. అది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని వారికీ తెలుసు.
సమిష్టి నాయకత్వాన్ని తయారుచేయడం ద్వారా అన్ని స్థాయిల్లోనూ నిర్ణయాలను తీసుకోవడానికి వీలవుతుందని జీ-23 అభిప్రాయపడింది. దీంతోపాటు కాంగ్రెస్ భావజాలంతో సారూప్యత ఉన్న పార్టీలతో కలిసికట్టుగా 2024 ఎన్నికలకు సిద్ధమవ్వాల్సి ఉందని ఆ నేతలంతా చెప్పారు. అప్పుడే బీజేపీని ఎదుర్కోగలమన్నారు. దీనిపై భవిష్యత్ చర్యలను త్వరలో ప్రకటించే ఛాన్సుంది. కానీ వారి మాటలను కాంగ్రెస్ వినే పరిస్థితి ఉందా?
కపిల్ సిబల్ అయితే ఏకంగా గాంధీలే పార్టీ నాయకత్వం నుంచి వైదొలగాలి అని చెప్పారు. అది ఎలాగూ సాధ్యం కాదు. కాకపోతే గతంలో కొన్నిసార్లు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గాంధీల కుటుంబం కాకుండా, పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు. అయినా గాంధీల ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పలేం. పైగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే దేశం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే ఛరిష్మా ఉన్న నాయకుడు లేరు. కేవలం గాంధీల కుటుంబం వల్లే ఇప్పటికీ అది సాధ్యమవుతోంది.
సోనియాగాంధీ రాజీనామ చేస్తానన్నా సరే.. సీడబ్ల్యూసీలో ఎక్కువమంది అంగీకరించలేదు. పార్టీ రాష్ట్ర నాయకత్వాలు కూడా గాంధీల కుటుంబంపైనే విశ్వాసాన్ని ఉంచాయి. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో గాంధీల కుటుంబం ప్రభావం లేకుండా కాంగ్రెస్ విజయం సాధించడం కూడా కష్టం. పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికే నష్టనివారణా చర్యలను చేపట్టింది. ఐదుగురు పీసీసీ అధ్యక్షులను రిజైన్ చేయమని కోరింది. దీంతో పార్టీ క్యాడర్ లో కూడా చలనం వచ్చింది.
జీ-23 లీడర్ల డిమాండ్ ఏమిటంటే.. పార్టీ సంస్థాగత నిర్మాణాన్నే పునర్వ్యవస్థీకరించాలని. మధ్యంతర ఎన్నికల ద్వారా పార్టీ అధ్యక్షుని స్థానాన్ని భర్తీ చేయాలని. కానీ కేవలం 23 మంది నేతల మాటలు విని పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పలేం. అయినా ఇప్పటికే జీ23 నేతల్లో జితిన్ ప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. యోగానంద శాస్త్రి ఎన్సీపీలో చేరిపోయారు. అందుకే వీరి బలం ఇప్పుడు 21కి పడిపోయింది. అలాంటప్పుడు వారిని పట్టించుకునేవారు ఎవరు? మొత్తానికి జీ23కి, కాంగ్రెస్ కు జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధంలో గెలిచేదెవరో, ఓడేదెవరో త్వరలోనే తేలే అవకాశం ఉంది.
Related News
Sonia Gandhi : ప్రతి పేద మహిళకు రూ.1లక్ష లభిస్తాయి.. సోనియా గాంధీ
Sonia Gandhi: కాంగ్రెస్ మ్యానిఫెస్టో(Congress Manifesto)లో పేర్కొన గ్యారంటీలపై కాంగ్రెస్(Congress)పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) మాట్లాడుతూ..తమ మ్యానిఫెస్టోలో తెలిపిన గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని అన్నారు. దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం వల్ల మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో అన్నారు. అలాంటి వారందరికీ