Countries Race To Sun : సూర్యుడిపై రీసెర్చ్ రేసులో ఉన్న దేశాలివీ..
Countries Race To Sun : సూర్యుడిపై రీసెర్చ్ కోసం కొద్దిసేపటి ముందే ఇస్రో నిర్వహించిన ‘ఆదిత్య L1’ ప్రయోగానికి సంబంధించిన లాంఛింగ్ ప్రక్రియ సక్సెస్ అయింది. లాంఛింగ్ ప్రక్రియలోని మూడు దశలు ఇప్పటికే సాఫీగా క్లియర్ అయ్యాయి.
- By Pasha Published Date - 01:21 PM, Sat - 2 September 23
Countries Race To Sun : సూర్యుడిపై రీసెర్చ్ కోసం కొద్దిసేపటి ముందే ఇస్రో నిర్వహించిన ‘ఆదిత్య L1’ ప్రయోగానికి సంబంధించిన లాంఛింగ్ ప్రక్రియ సక్సెస్ అయింది.
లాంఛింగ్ ప్రక్రియలోని మూడు దశలు ఇప్పటికే సాఫీగా క్లియర్ అయ్యాయి.
రూ.400 కోట్ల ఖర్చుతో ఆదిత్య L1 శాటిలైట్ ను 15లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ 1 కు ఇస్రో పంపిస్తోంది.
ఈ తరుణంలో ఇప్పటికే ఇలా సూర్యుడిపై రీసెర్చ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న దేశాలేవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Also read : Moon To Mars : చంద్రుడి నుంచి మార్స్ పైకి మిషన్.. నాసా టీమ్ కు ఇండియన్ సారథ్యం
సూర్యుడిపై రీసెర్చ్ విషయంలో ఇండియా కంటే కొన్ని దేశాలు ముందంజలో ఉన్నాయి. అమెరికా స్పేస్ ఏజెన్సీ ‘నాసా’, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ‘ఈసా’, జపాన్ స్పేస్ ఏజెన్సీ ‘జాక్సా’, జర్మనీ, చైనాలు ఇప్పటికే వాటి స్పేస్ క్రాఫ్ట్ లను సూర్యుడిపై రీసెర్చ్ కోసం పంపించాయి. అయితే ప్రయోగాల కోసం జపాన్, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లు నాసా హెల్ప్ ను తీసుకున్నాయి. ఇప్పటివరకు సూర్యుడి వైపుగా భూమి నుంచి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ల సంఖ్య కేవలం 22 (Countries Race To Moon) మాత్రమే. ఇప్పుడు మనం పంపిన ‘ఆదిత్య ఎల్-1’ స్పేస్ క్రాఫ్ట్ 23వది అవుతుంది.
Also read : Neha Shetty: రాధిక హాట్ లుక్స్.. రెడ్ శారీ ధరించి, అందాలు ఒలకబోసి!
దేశాలవారీగా ప్రయోగాల చిట్టా..
- అమెరికాకు చెందిన నాసా 1960-69 టైంలోనే ‘పయొనీర్’ పేరుతో 6 ఆర్బిటర్లను సూర్యుడి మీద ప్రయోగాలకు లాంఛ్ చేసింది. వీటిలో ఐదు సక్సెస్ కాగా ఒకటి ఫెయిల్ అయింది. అయితే వీటి ప్రయోగాలు కొంతమేర మాత్రమే సూర్యుడిపై ఫోకస్ తో జరిగాయి. ‘పయొనీర్’ మిషన్ లు ఎక్కువగా శుక్రగ్రహంపై ఫోకస్ చేశాయి.
- జపాన్ అత్యధికంగా ఐదుసార్లు సూర్యుడు లక్ష్యంగా స్పేస్ క్రాఫ్ట్ లను ప్రయోగించింది. 1981లో హింటోరి పేరుతో తొలిసారి సూర్యుడి పై పరిశోధనలకు స్పేస్ క్రాఫ్ట్ ను పంపించింది.
- యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 1990లో తొలిసారిగా సూర్యుడి ధృవాలపై పరిశోధనల కోసం యులిసెస్ పేరుతో స్పేస్ క్రాప్ట్ ను ప్రయోగించింది.
- జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ లతో కలిసి నాసా సూర్యుడిపై ప్రయోగాలు చేసింది.
- 2018లో నాసా ప్రయోగించిన పార్కర్ ప్రోబ్ సూర్యుడిని టచ్ చేసిన తొలి, ఏకైక ఉపగ్రహం. పార్కర్ ప్రోబ్ అనేది చిన్నకారు సైజులో ఉండే స్పేస్ క్రాఫ్ట్. సూర్యుడి పై ఉండే వాతావరణాన్ని స్టడీ చేసేందుకు దీన్ని పంపగా, సూర్యుడికి సంబంధించిన ప్లాస్మా, కొరోనాను అద్భుతంగా ఫోటోలు తీసి నాసాకు సెండ్ చేసింది. 2025 వరకూ ఇది పనిచేస్తూనే ఉంటుంది. పార్కర్ ప్రోబ్ ప్రయోగానికి ఏకంగా 12వేల కోట్లు ఖర్చు చేశారు.
- చైనా లేటెస్ట్ గా 2022 లో ప్రయోగించిన అసోస్ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడిపై పరిశోధనలు చేస్తోంది.
Tags
Related News
NASA : నాసా అవార్డులను గెలుచుకున్న భారతీయ విదార్థులు
NASA: అహ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ కోసం ఢిల్లీ మరియు ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల(Indian students) బృందాలు నాసా(NASA)నుండి అవార్డులను గెలుచుకున్నాయి. అలబామా రాష్ట్రంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అ�