Rahul Gandhi Warning: ఈడీతో భయపడం – బీజేపీకి రాహుల్ సవాల్
వ్యూహాత్మకంగా ఈడీని బీజేపీ ప్రయోగిస్తుందని రాహుల్ అభిప్రాయపడ్డారు.
- By CS Rao Published Date - 02:35 PM, Thu - 4 August 22
వ్యూహాత్మకంగా ఈడీని బీజేపీ ప్రయోగిస్తుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఒత్తిడి తీసుకొస్తే మౌనంగా ఉంటామని అనుకోవద్దని బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సోదరభావాన్ని రక్షించడానికి బీజేపీపై పోరాటం ఆగదని వెల్లడించారు. యంగ్ ఇండియన్ ప్రాంగణాన్ని సీజ్ చేసిన తరువాత చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ క్యాడర్ కు ధైర్యం నింపేలా ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఢిల్లీలోని కాంగ్రెస్ యాజమాన్యంలోని నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలోని యంగ్ ఇండియన్ ప్రాంగణాన్ని ED తాత్కాలికంగా సీల్ చేసిన ఒక రోజు తర్వాత రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రాంగణాన్ని తెరవరాదని కూడా ED ఆదేశించింది. హెరాల్డ్ హౌస్ భవనంలో మిగిలిన నేషనల్ హెరాల్డ్ కార్యాలయం ఉపయోగం కోసం తెరిచి ఉంది.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించిన వారం తర్వాత నేషనల్ హెరాల్డ్-AJL-యంగ్ ఇండియన్ డీల్లోని ITO సమీపంలోని వార్తాపత్రిక బహదూర్షా జాఫర్ మార్గ్ కార్యాలయం, 11 ఇతర ప్రదేశాలపై ED దాడి చేసిన విషయం విదితమే. యంగ్ ఇండియన్ ఆఫీస్ ప్రాంగణాన్ని ఈడీ తాత్కాలికంగా సీల్ చేసిన వెంటనే విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, అజయ్ మాకెన్, అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పార్టీ బెదిరిపోదనిఅన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ముట్టడి చేసిందని ఆరోపించారు. ప్రధాన కార్యాలయాన్ని , పార్టీ అధినేత్రి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ నివాసాలను “ఉగ్రవాదులుషగా కేంద్రం చుట్టుముట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ఆఫీస్, సోనియా, రాహుల్ ఇళ్ల వద్ద పోలీసులను భారీ మోహరించడాన్ని తప్పుబట్టారు.
Tags
Related News
PM Modi Vs Rahul Gandhi : ప్రధాని మోడీ, రాహుల్గాంధీ ప్రసంగాలపై ఈసీ నోటీసులు
PM Modi Vs Rahul Gandhi : రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.