UP PCS J Result 2023: తొలి ప్రయత్నంలోనే సివిల్ జడ్జిగా శివాలి మిశ్రా
కస్టపడి కాకుండా ఇష్టపడి చదివితే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని నీరుపించింది ఉత్తరప్రదేశ్ కు చెందిన శివాలి మిశ్రా. లఖింపూర్లోని మొహల్లా బాజ్పాయ్ కాలనీకి చెందిన శివాలి మిశ్రా సివిల్ జడ్జిగా ఎన్నికైంది.
- By Praveen Aluthuru Published Date - 09:39 PM, Wed - 30 August 23
UP PCS J Result 2023: కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని నీరుపించింది ఉత్తరప్రదేశ్ కు చెందిన శివాలి మిశ్రా. లఖింపూర్లోని మొహల్లా బాజ్పాయ్ కాలనీకి చెందిన శివాలి మిశ్రా సివిల్ జడ్జిగా ఎన్నికైంది. రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించింది. శివాలి సీనియర్ న్యాయవాది రాజీవ్ మిశ్రా కుమార్తె. విశేషమేమిటంటే తొలి ప్రయత్నంలోనే శివాలి ఈ ఘనత సాధించి న్యాయనిర్ణేతగా పేరుగాంచింది.
శివలీ డాన్బాస్కో స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఆ తరువాత ఆమె లక్నోలోని డాక్టర్ శకుంతల పునర్వస్ నేషనల్ యూనివర్శిటీ నుండి ఐదు సంవత్సరాల LLB పూర్తి చేసింది. ఎల్ఎల్బీలోనూ టాపర్గా నిలిచి బ్రౌన్ మెడల్ సాధించింది.తర్వాత శివాలి ఎల్ఎల్ఎం కోసం ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంది. LLM సమయంలోనే శివాలి JRF మరియు NET పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు మరియు PCS J కోసం కూడా సిద్ధమయ్యారు.
శివాలికి తండ్రి రాజీవ్ మిశ్రా కూడా న్యాయవాది. తల్లి కూడా లాయర్. ఆమె కుటుంబంలో రెండో సంతానం. అక్క సురభి మిశ్రా ఎల్ఎల్ఎం తర్వాత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. తమ్ముడు యశ్వర్ధన్ మిశ్రా డెహ్రాడూన్లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్లో శాస్త్రవేత్త.
Also Read: Ghanpur : కేసీఆర్ సార్ ఛాన్స్ ఇస్తే..ఎమ్మెల్యే గా పోటీ చేస్తానంటున్న ‘జానకీపురం సర్పంచ్ నవ్య’
Related News
Hyderabad Metro : అమెరికా యూనివర్సిటీలో హైదరాబాద్ మెట్రో సక్సెస్ స్టోరీ
Hyderabad Metro : మన హైదరాబాద్ మెట్రో సక్సెస్ స్టోరీ అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ విద్యార్థులు, ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా మారింది.