PM KISAN – 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్.. “పీఎం-కిసాన్” సాయం రూ.3000 పెంపు ?
PM KISAN - 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్!! ‘పీఎం-కిసాన్’ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా అందించే ఆర్థిక సాయాన్ని మరో రూ.3000 పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
- By Pasha Published Date - 11:39 AM, Tue - 22 August 23
PM KISAN – 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్!! ‘పీఎం-కిసాన్’ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా అందించే ఆర్థిక సాయాన్ని మరో రూ.3000 పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ‘పీఎం-కిసాన్’ పథకం కింద ప్రస్తుతం ఏడాదికి రూ.6 వేలు చొప్పున కేంద్ర సర్కారు అన్నదాతలకు అందిస్తోంది.ఈ 6వేల రూపాయలను రూ.2 వేలు చొప్పున ఏడాదిలో మూడు విడతల్లో రైతుల అకౌంట్స్ లో జమ చేస్తున్నారు.
Also read : Rajinikanth : సీఎం యోగీ కాళ్లు మొక్కడం ఫై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్
ఇది మరో రూ.3000 పెరిగితే ‘పీఎం-కిసాన్’ ద్వారా అందే పెట్టుబడి సాయం మొత్తం రూ.9వేలకు (PM KISAN – 3000 Hike) చేరుతుంది. ‘పీఎం-కిసాన్’ సాయం పెంపునకు సంబంధించిన ప్రపోజల్ ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉందని “ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్” లో కథనం వచ్చింది. ‘పీఎం-కిసాన్’ పథకం 2018 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది.
Related News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు..! ఎప్పుడంటే..?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024కి ఇంకా తేదీ నిర్ణయించబడలేదు.