UIDAI Warns: ఒరిజినల్ “ఆధార్” ఇవ్వొద్దు!
మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీని జిరాక్స్ తీసి అందరికీ ఇస్తున్నారా?
- By Balu J Published Date - 11:42 PM, Sun - 29 May 22
మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీని జిరాక్స్ తీసి అందరికీ ఇస్తున్నారా? అయితే ఇప్పటి నుంచి అలా చేయొద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేవలం ఆధార్ కార్డుల మాస్క్డ్ కాపీస్ను మాత్రమే షేర్ చేయాలని తెలిపింది. ఆధార్ కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఇదొక్కటే మార్గమని పేర్కొంది. మాస్క్డ్ కాపీ అంటే.. ఆధార్ నంబర్ లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేది. ఇతరుల ఆధార్ కార్డుల కాపీలను సేకరించి, తమ వద్ద ఉంచుకునేందుకు హోటళ్ళు, సినిమా హాళ్ళు వంటి లైసెన్స్ లేని సంస్థలకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. భారత దేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) నుంచి యూజర్ లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే వ్యక్తిని గుర్తించేందుకు ఆధార్ను ఉపయోగించవచ్చునని తెలిపింది. ప్రజల నుంచి ఆధార్ కార్డు కాపీని తీసుకునే ముందు.. సంబంధిత సంస్థలు ఇటువంటి యూజర్ లైసెన్స్ ఉన్నట్లు ధ్రువీకరించు కోవాలని చెప్పింది. ఆధార్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రజలు పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించు కోవద్దని తెలిపింది. ఒకవేళ ఇటువంటి కంప్యూటర్లను ఉపయోగించినట్లయితే, ఈ-ఆధార్ కాపీలను ఆ కంప్యూటర్ల నుంచి శాశ్వతంగా డిలీట్ చేసినట్లు ధ్రువీకరించుకోవాలని వివరించింది.
మాస్క్డ్ ఆధార్ డౌన్లోడ్ ఇలా..
* UIDAI అధికారిక వెబ్సైట్లో Download Aadhar ఆప్షన్ను ఎంచుకోవాలి.
* ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ నంబర్ను ఎంటర్ చేయాలి.
* మాస్క్డ్ ఆధార్ టిక్బాక్స్ను ఓకే చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత Send OTP బటన్పై క్లిక్ చేయాలి. ఆధార్తో జత చేసిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత డౌన్లోడ్పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత ఆధార్ డౌన్లోడ్ అవుతుంది. పాస్వర్డ్ నమోదు చేస్తే కార్డు కనిపిస్తుంది. ఆధార్ కార్డులో మీ పేరు ప్రారంభంలోని మొదటి నాలుగు అక్షరాలను కేపిటల్ లెటర్స్లో టైప్ చేసి, మీ పుట్టిన సంవత్సరాన్ని టైప్ చేయాలి. అప్పుడు మాస్క్డ్ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.
Tags
Related News
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ను హెచ్చరించిన ఈసీ..
రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ సలహాదారులకు కేబినెట్ మంత్రుల హోదా ఉన్నందున మోడల్ ప్రవర్తనా నియమావళి నిబంధనలు వారికి వర్తిస్తాయని ఎన్నికల సంఘం మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి తెలియజేసింది.