Ganja Smuggling: గంజాయి స్మగ్లింగ్లో మైనర్లు… కొత్తగూడెంలో వెలుగు చూసిన ఘటన
కొత్తగూడెంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మైనర్ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
- By Hashtag U Published Date - 07:03 PM, Mon - 2 May 22
కొత్తగూడెంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మైనర్ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీసులు 4 ఇంక్లైన్ ప్రాంతంలో 4.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ సబ్ ఇన్స్పెక్టర్ జుబేదా బేగం, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో యువకులు మోటర్బైక్పై వెళుతుండగా అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించి వారిని ఆపారు. పోలీసులు తనిఖీ చేయగా యువకుల వద్ద గంజాయి ప్యాకెట్లను గుర్తించారు.
విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఆర్ హేమంత్కుమార్ అనే నిందితుడు మైనర్ బాలుడితో కలిసి గంజాయిని విజయవాడలో విక్రయించేందుకు సీలేరు మండలం డొంకరాయి గ్రామంలో కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. మోటారు బైక్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.77,760 ఉంటుందని ఎస్ ఐ లావుడ్యరాజు తెలిపారు.
Related News
Kothagudem: మావోయిస్టు కుటుంబాలకు పోలీసుల కౌన్సిలింగ్.. “ఆపరేషన్ చేయూత” ద్వారా సాయం
Kothagudem: కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో “ఆపరేషన్ చేయూత” ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సీపిఐ మావోయిస్టు పార�