Kurnool : పురుగుమందుల సంచిలో పండ్లు తిని రెండేళ్ల చిన్నారి మృతి
- By Prasad Published Date - 08:33 AM, Sun - 12 June 22
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నేరేడు పండు తిని ఆహారం విషతుల్యమై రెండేళ్ల చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. పురుగు మందులను తీసుకెళ్లేందుకు ఉపయోగించే సంచిలో ఈ పండ్లను నిల్వ ఉంచినట్లు సమాచారం.ముగ్గురు చిన్నారులు రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు వారుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అంజి, హర్ష మరణించారు. వీరిద్దరు తోబుట్టువులు. నేరేడు పండ్లు తిన్న కొద్ది నిమిషాలకే చిన్నారులకు వాంతులు రావడంతో ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హర్ష మృతి చెందగా, మిగిలిన వారిని ఆదోనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ రాజా రెడ్డి తెలిపారు. అయితే ఆస్పత్రిలో చేరిన వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎంపీపీ ఈరన్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్యస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
Related News
Parenting Tips: పిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ఈ సమస్యల బారిన పడ్డట్టే!
Parenting Tips: శీతల పానీయాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది పిల్లలలో ఊబకాయాన్ని పెంచుతుంది. పిల్లలు దీన్ని ఎక్కువగా తాగినప్పుడు, వారి అదనపు కేలరీలు పెరుగుతాయి, ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది. అందువల్ల, పండ్ల రసం లేదా నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగమని చెబుతూ ఉండాలి దంత సమస్యలు: శీతల పానీయాలలో ఉండే చక్కెర మరియు యాసిడ్ పిల్లల దంతాలకు హానికరం. ఈ రెండూ కలిసి దంతక్షయాన్ని కలిగ�