Viral Video: చెట్టు మధ్యలో ఇరుక్కుపోయిన ఎద్దు.. సాయం చేసినవారిని ఏం చేసిందో చూస్తే షాక్?
సాధారణంగా కొన్ని మూగ జంతువులు తెలిసి తెలియక చేసే పనుల వల్ల అవి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ
- By Nakshatra Published Date - 06:10 PM, Fri - 4 November 22
సాధారణంగా కొన్ని మూగ జంతువులు తెలిసి తెలియక చేసే పనుల వల్ల అవి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాయి. మరికొన్ని జంతువులు అయితే అవి చేసే తింగరి పనుల వల్ల ప్రాణాలు సైతం పోతూ ఉంటాయి. మామూలుగా ఆవులు ఎద్దులు లేదా గేదెలు లాంటి జంతువులు వాటి మెడకు ఉన్న తాడుని బిర్రుగా చుట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు అవి అలా చేసుకొని వాటి ప్రాణం పోగొట్టుకుంటూ ఉంటాయి. ఈ మూగ జీవాలు కొన్నిసార్లు మనుషులు వాటికి ఎటువంటి హాని కలిగించక పోయినా కూడా మనుషుల్ని పొడవడం లేదంటే గాయపరచడం లాంటివి చేస్తూ ఉంటాయి.
అందుకే చాలామంది ఆవులు గేదెలు దగ్గరికి వెళ్ళాలి అంటేనే భయపడుతూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో షో వైరల్ అవుతోంది. అయితే ఒక ఎద్దుకి సహాయం చేయాలి అనుకున్నా వారి మంచికి చెడు ఎదురయ్యింది. పూర్తి వివరాలోకి వెళితే.. ఆ వీడియోలో ఒక ఎద్దు మెడ ఒక చెట్టు రెండు కొమ్మల మధ్య దాని తల ఇరుక్కుంది. అయితే దాని తల ఇరుక్కుపోవడంతో అది ఎంత ట్రై చేసినా కూడా రాలేదు. దీంతో ఇద్దరు వ్యక్తులు ఎందుకు సహాయం చేయడం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఎద్దు దగ్గర నిలబడగా మరొక వ్యక్తి వెళ్లి ఆ కొమ్మను ఒంచుతూ దాని తలను విడిపించే ప్రయత్నం చేశాడు.
Kindness doesn’t always work! 🤣🤣 pic.twitter.com/UcDPtSV67g
— Figen (@TheFigen_) November 3, 2022
ఆ వ్యక్తికి సాధ్యం కాకపోవడంతో మరొక వ్యక్తి హెల్ప్ కూడా తీసుకున్నాడు. అలా వారిద్దరూ ఆ చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఆ ఎద్దును విడిపించే ప్రయత్నం చేయగా ఎట్టకేలకు ఆ ఎద్దు తల ఆ కొమ్మల మధ్యలో నుంచి బయటకు వచ్చింది. దాంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న ఆ వ్యక్తులకు ఆ ఎద్దు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ ఆ ఎద్దు ఆ వ్యక్తులను కాపాడారు అన్న విషయాన్ని కూడా మరిచిపోయి వెళ్తూ వెళ్తూ వాళ్ళిద్దర్నీ ఒక గుద్దు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో ఆ ఇద్దరు వ్యక్తులు పాపం కింద పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Related News
Vote : ఓటు విలువ ప్రాసలో అదరకొట్టిన తీరుకు నెటిజన్ల ఫిదా
భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ..ఓటర్లలో ఓటు పాదాన్యం తెలియజేస్తూ వస్తున్నారు