TS Betting:తెలంగాణలో కోడి పందేలు
ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైన కోడిపందేల సంస్కృతి తెలంగాణాకి కూడా విస్తరించింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు, బెట్టింగ్ లు జోరుగా సాగాయి.
- By Siddartha Kallepelly Published Date - 07:00 AM, Sun - 16 January 22
ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైన కోడిపందేల సంస్కృతి తెలంగాణాకి కూడా విస్తరించింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు, బెట్టింగ్ లు జోరుగా సాగాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ నుండి కూడా పందెంరాయుళ్లు సరిహద్దుకు తరలివచ్చారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర మండలాల్లో కోడి పందేలు జరిగే ప్రాంతాలకు పందెం కాసేవాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల మీదుగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించే కోడిపందేల స్థావరాలకు కూడా పందెం కాసేవాళ్ళు వచ్చినట్టు సమాచారం.
కొమరం భీం ఆసిఫాబాద్ జిలాల్లో కూడా పలువురు కోడిపందేలు ఆడుతూ పట్టుబట్టినట్లు సమాచారం. తెలంగాణాలో పలు జిల్లాల్లో కోడి పందేలు నిర్వహిస్తూ, అరెస్ట్ అయిన వారందరిపై ప్రభుత్వం కేసులు పెట్టి కౌన్సిలింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Related News
Mahadev App Case: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో చర్యలు.. 16 ప్రదేశాల్లో ఈడీ సోదాలు
ED Searches : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు(mahadev app case) విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబయి, పశ్చిమబెంగాల్లోని సుమారు 16 ప్రాంతాల్లో బుధవారం తనిఖీలు చేపట్టింది. యాప్కు చెందిన ప్రధాన సూత్రధారులు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ల సన్నిహితుడు నితీశ్ దివానన్ను ఈడీ అరెస్టు చేసిన 11రోజుల తర్వాత దాడులు జరగడం గమనార్హం. ఈ కేసులో ఈడీ ఇప్పటి�