2 Killed : ధర్మవరంలో రైలు ఢీకొని వృద్ధ దంపతులు మృతి
ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ను దాటుతుండగా వృద్ధ దంపతులను రైలు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు
- Author : Prasad
Date : 15-08-2023 - 8:16 IST
Published By : Hashtagu Telugu Desk
ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ను దాటుతుండగా వృద్ధ దంపతులను రైలు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కనగానిపల్లి మండలం కోనాపురం గ్రామానికి చెందిన కె.రాములమ్మ(65), భర్త కె.నరసింహులు(70) దంపతులుగా పోలీసులు గుర్తించారు . కేతిరెడ్డి కాలనీలోని తమ కుమార్తె ఇంటికి వెళ్లేందుకు ధర్మవరం వచ్చారు. అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కేందకు వస్తుండగా.. కేతిరెడ్డి కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ధర్మవరం రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు.