Karnataka: అరుదైన ఘనత సాధించిన వ్యక్తి.. రివర్స్ గేర్ లో 75 కిలోమీటర్లు ప్రయాణం?
టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదు అన్న విషయం తెలిసిందే. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంటు.. అనే పాటను కూడా వినే ఉంటాం. చాలామంది సమయం
- By Nakshatra Published Date - 03:50 PM, Tue - 5 September 23
టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదు అన్న విషయం తెలిసిందే. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంటు.. అనే పాటను కూడా వినే ఉంటాం. చాలామంది సమయం సందర్భాన్ని బట్టి వారిలో ఉన్న టాలెంట్ ని వివిధ రూపాల్లో బయట పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు అరుదైన రికార్డులను ఘనతలను కూడా సొంతం చేసుకుంటూ ఉంటారు. సంగతి అటు ఉంచితే గా మనం వాహనాలను స్ట్రైట్ గా నడపడానికి ముందు వెనక చూసి నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా నడిపిన కూడా వాహనాలకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
అలాంటిది రివర్స్ గేర్ లో వాహనాలను నడపడం అన్నది కొంచెం కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. వాహనాలను నడపడంలో చాలా అనుభవం ఉన్నవారు మాత్రమే అలాంటి సాహసాలను చేయడానికి ఒడిగడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అలా అనుభవం ఉన్నవారికి కూడా ఎదురు దెబ్బలు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి అరుదైన ఘనతను సాధించారు. ఆ వ్యక్తికి అది ఒక మొక్కు అయినప్పటికీ నిజానికి అది ఒక అరుదైన ఘనత అని చెప్పవచ్చు.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఏం చేశాడు? అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.. ట్రాక్టర్ను రివర్స్లో నడుపుతూ ఓ యువకుడు తమ ఇలవేల్పు యల్లమ్మ దేవికి మొక్కుబడి తీర్చుకున్నాడు. హుబ్లీ తాలూకా మంటూరు గ్రామానికి చెందిన బాబుగౌడ అనే 22 ఏళ్ళ భక్తుడు గత కొన్నేళ్లుగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. అయితే రివర్స్ గేర్లో ఇలా 75 కి.మీ. వెళ్లడం ఇదే మొదటిసారి అని, కోరిక తీరడంతో మొక్కు తీర్చాను అని సదరు వ్యక్తి తెలిపారు.
ఆ మేరకు ఉదయం 6.15 గంటలకు మంటూరు వలంబేశ్వర దేవస్థానం నుంచి రివర్స్ గేర్లో బయల్దేరాడు. కుసుగల్, బ్యాహట్టి, తిర్లాపుర, అళగవాడి, హంచనాళ, తిక్కుంబి, హిరేకుంబి, ఉగరగోళ, సౌదత్తికి వెళ్లి అక్కడి నుంచి యల్లమ్మన గుడ్డను మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకొన్నాడు. మొత్తం 75 కి.మీ.ల దూరాన్ని 7.30 గంటల్లో ప్రయాణించాడు. దీంతో ఆ వ్యక్తి చేసిన పనికి సాధించిన ఘనతకు నెటిజన్స్, ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు అటువంటి సాహసాలు చేయవద్దని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags
Related News
Woman Stabs Daughter: మార్కుల విషయమై కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి
కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.