KTR : నేడు మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న కేటీఆర్..
ఇటీవల కేటీఆర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ నేడు కమిషన్ ముందు హాజరుకానున్నారు.
- By Kavya Krishna Published Date - 10:21 AM, Sat - 24 August 24

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఉదయం11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఇటీవల కేటీఆర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ నేడు కమిషన్ ముందు హాజరుకానున్నారు. అయితే.. తెలంగాణ భవన్లో ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఈ నెల 16న నోటీసులు జారీ చేశారు కమిషన్.
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఈ నెల 16నే క్షమాపణలు చెప్పారు. ‘పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’అని కేటీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదే కాకుండా.. ఈ నెల 17వ తేదీన కూడా తన వ్యాఖ్యలకు బేషరతు బహిరంగ క్షమాపణ చెబతున్నట్లు కేటీఆర్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా మహిళా కమిషన్ నోటీసుల మేరకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని కేటీఆర్ వెల్లడించారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొల్లాపూర్, షాద్నగర్తో పాటు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల వివరాలను కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్కు అందజేస్తానని ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Also : Hyundai Alcazar: స్టైలిష్గా హ్యుందాయ్ అల్కజార్ ఫేస్లిఫ్ట్.. బుకింగ్స్ షురూ!