Terrorist attack: ఉగ్రవాదులు దాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు, ఒకరు మృతి
- By Balu J Published Date - 11:50 AM, Sat - 12 February 22
భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్ల జాయింట్ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. అది పేలడంతో ఒక పోలీస్ చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక పోలీస్, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే అదనపు బలగాలను సంఘటనా స్థలానికి రప్పించారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
Related News
Congress : కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్పై దాడి
Attack on Kanhaiya Kumar: నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్ నేత(Congress leader) కన్హయ్య కుమార్(Kanhaiya Kumar) పై దాడి జరిగింది. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయన పై కొందరు చేయిచేసుకున్నారు. అయితే ఈదాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్హయ్యపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు వీడియోను విడుదల చేశారు. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నార�