HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Toll In Botched Up Family Planning Surgery Up At

Ibrahimpatnam Family Planning: వికటించిన కు.ని సర్జరీలు.. నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కలకలం రేగింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించి నలుగురు మహిళలు చనిపోయారు. వరుసగా 3 రోజుల్లో ఈ నలుగురు మహిళలు చనిపోవడం గమనార్హం.

  • Author : Hashtag U Date : 31-08-2022 - 1:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Imresizer
Harish Imresizer

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కలకలం రేగింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించి నలుగురు మహిళలు చనిపోయారు. వరుసగా 3 రోజుల్లో ఈ నలుగురు మహిళలు చనిపోవడం గమనార్హం.
అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న మిగతా 30 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో 11 మందికి, నిమ్స్‌లో 12మందికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు డీహెచ్​ ఆధ్వర్యంలో ఐదుగురు నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది.మృతుల పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వారి మరణానికి గల కారణాలు తెలుస్తాయని వెల్లడించింది.

ఆగస్టు 25న..

ఇబ్రహీం పట్నంలోని సామాజిక  ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. సామూహిక స్టెరిలైజేషన్ శిబిరంలో భాగంగా 34 మందికి నిర్వహించిన శస్త్ర చికిత్సల్లో కొంతమందికి వికటించాయి. మూడ్రోజుల తర్వాత కొందరు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. 28న నర్సాయిపల్లికి చెందిన మమత చికిత్సపొందుతూ చనిపోయింది. సోమవారం మంచాల మండలం లింగంపల్లి వాసి సుష్మ మృతిచెందింది. సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక చికిత్స పొందుతూ మరణించారు.

చర్యలు..

ఈనేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యుడి లైసెన్స్‌ ను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, రెండు పడకల గదుల ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు. రోజుకు 30 కుటుంబ ఆపరేషన్లు చేయాలి కానీ ఆరోజు 34 చేశారని తెలుస్తోంది.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, పిల్లలకు రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉచితంగా విద్యనందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4 dead post operation
  • family planning surgery botched up
  • ibrahimpatnam

Related News

    Latest News

    • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

    • వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

    • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

    • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

    • బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd