Viral: విద్యార్థినితో పెళ్లి కోసం పురుషుడిగా మారిన టీచర్?
ఒక టీచర్ విద్యార్థి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వారిద్దరూ కూడా ఆడవారే. అయితే విద్యార్థిని ప్రేమించిన ఆ టీచర్ పెళ్లి
- By Nakshatra Published Date - 07:15 PM, Tue - 8 November 22
ఒక టీచర్ విద్యార్థి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వారిద్దరూ కూడా ఆడవారే. అయితే విద్యార్థిని ప్రేమించిన ఆ టీచర్ పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన మీరా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ టీచర్ గా పని చేస్తోంది. అదే పాఠశాలలో చదువుతున్న కల్పన అనే అమ్మాయితో మీరా కు స్నేహం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఎలా అయినా కల్పనని వివాహం చేసుకోవాలి అని మీరా భావించింది.
దీంతో కల్పన ని పెళ్లి చేసుకోవడం కోసం మీరా లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుంది. తర్వాత మీరా తన పేరు కాస్త ఆరవ్ కుంతల్ గా మార్చుకుంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి ఇరువురి ఇంట్లో చెప్పి వారి పెద్దలను ఒప్పించారు. ఇంకా పెద్దల అంగీకారంతో రెండు రోజుల క్రితం వైవాహిక బంధంతో ఒకటయ్యారు. లింగ మార్పిడి విషయంపై మీరా అలియాస్ ఆరవ్ స్పందిస్తూ..ప్రేమలో ఏదైనా కరెక్టే అందుకే నేను లింగ మార్పిడి చేయించుకున్నాను. స్కూల్లో ప్లే గ్రౌండ్ లో కల్పన తో నా పరిచయం ప్రేమగా మారింది. నాకు నలుగురు అక్కలు కాగా నేను కూడా అమ్మాయిగా పుట్టడం వల్ల నాకు అబ్బాయిగా ఉండాలి అనిపించేది. చిన్నప్పటినుంచి అలాగే ప్రవర్తించాను.
అందుకే లింగ మార్పిడి చేయించుకోవాలి అనుకున్నా ఇదే విషయాన్ని కల్పన తో చెప్పాను. అలా 2019 డిసెంబర్లో నాకు తొలి శస్త్ర చికిత్స జరిగి ఆ సమయంలో నేను కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నా ప్రయత్నం ఫలించింది. మా ఇంట్లో వాళ్ళు కూడా అంగీకరించడంతో మేమిద్దరం ఒక్కటే ఏమో అని ఆరవ్ చెప్పుకొచ్చాడు. అనంతరం కల్పన స్పందిస్తూ తనంటే కూడా నాకు చాలా ఇష్టం. సర్జరీ చేయించుకోకపోయినా నేను తనని పెళ్లి చేసుకునేదాన్ని అని తెలిపింది కల్పన.
Related News
USA: అమెరికాలో మరో ఘోరం.. తెలంగాణ యువకుడు మృతి, కారణమిదే!
విదేశాల్లో భారతీయుల చనిపోతున్న సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలు.. ఆత్మహత్యలు, ఇతర కారణాల వల్ల తెలుగువాళ్లు చనిపోతున్నారు. తాజాగా మరోకరు చనిపోయారు. మార్చి 9న ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో అమెరికాలో చదువుతున్న తెలంగాణకు చెందిన 27 ఏళ్ల వెంకటరమణ పిట్టల అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా ద్వీపం సమీపంలోని ఫ్యూరీ ప్లేగ్రౌండ్ వద్ద మధ్యాహ�