TDP: టీడీపీ ఈ-పేపర్ ప్రారంభం
తెలుగు దేశం పార్టీ సొంత పత్రికను ప్రారంభించింది. చైతన్య రథం పేరుతో ఈ-పేపర్ ను చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు.
- By Hashtag U Published Date - 09:27 PM, Tue - 11 January 22
తెలుగు దేశం పార్టీ సొంత పత్రికను ప్రారంభించింది. చైతన్య రథం పేరుతో ఈ-పేపర్ ను చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. ఒక క్లిక్ తో సుమారు 30 లక్షల మందికి ఆ పేపర్ వెళ్ళింది. ఆ మేరకు టెక్నాలజీ ని రూపొందించారు. పార్టీ సమాచారంతో పాటు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పరిశోధనాత్మక కథనాలు ఈ-పేపర్ లో ఉంటాయని చంద్రబాబు ప్రకటించాడు.
అమరావతి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ-పేపర్ ను ఆవిష్కరించారు. వెబ్, ఫోన్ల ద్వారా ఈ-పేపర్ ను వీక్షించవచ్చు.
ఈ-పేపర్ ప్రారంభోత్సవం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచే ఆయుధమే ‘చైతన్యరథం’ అని అన్నారు. తమకు వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదన్నట్టు జగన్ సర్కారు వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
లక్షల మంది పార్టీ కార్యకర్తలకు సమాచార వారధిలా ‘చైతన్యరథం’ ఈ-పేపర్ పనిచేస్తుందని అన్నారు. ఒక్క క్లిక్ తో 30 లక్షల మందికి ఈ-పేపర్ వెళ్లిందని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి… చదివించండి. (1/2)#TeluguDesamEpaper #tdpepaper pic.twitter.com/pQ1FmpVCSv
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) January 11, 2022
Related News
Chandrababu Naidu: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం.. పోలింగ్ పై చంద్రబాబు రియాక్షన్
Chandrababu Naidu: రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు అంటూ ఏపీ పోలింగ్ పై రియాక్ట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్�