TDP: రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టేనా?
- By Balu J Published Date - 09:52 AM, Thu - 8 February 24
TDP: ప్రస్తుతం టిడిపికి ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆయనే కనకమెడల రవీంద్ర. వచ్చే నెలలో ఆయన రిటైర్ కానున్నారు. దీంతో రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టే. ప్రస్తుతం ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెలాఖరున ఓటింగ్ జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అనూహ్య విజయం దక్కించుకున్నారు.
మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. చివరి స్థానానికి టిడిపి అభ్యర్థిని నిలిపింది. అప్పటికే నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించారు. కానీ అనూహ్యంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపొందారు. సరిగ్గా ఇటువంటి ఫలితమే రాజ్యసభ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే టిడిపి అభ్యర్థిని ప్రకటించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది అంత సులువు అయ్యే పని కాదని తేలుతోంది. ఒకవైపు సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.
రాజ్యసభ స్థానం దక్కించుకోవాలంటే దాదాపు 45 ఓట్లు అవసరం. ప్రస్తుతం టిడిపికి ఉన్న బలం 18 మంది ఎమ్మెల్యేలు. ఈ లెక్కన మరో 27 మందిని ఆకర్షించాలి. అది అయ్యే పనియేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా విప్ జారీ చేస్తుంది. పార్టీ ఏజెంట్ కు చూపి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ముందుకు వచ్చేది ఎంతమంది? వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతోంది. సిట్టింగ్లను మార్చడంతో జగన్ పై ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. కానీ వారు రాజకీయంగా విభేదిస్తారా? లేదా? అన్నది తెలియాలి.
Tags
Related News
AP Politics : వైసీపీకి సంక్షోభం తప్పదా..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికల ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార వైసీపీ పాలనను గద్దె దించేందుకు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది.