ED Chief Extension Illegal : కేంద్రానికి సుప్రీం షాక్.. ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధమని వ్యాఖ్య
ED Chief Extension Illegal : సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది..
- By Pasha Published Date - 03:37 PM, Tue - 11 July 23
ED Chief Extension Illegal : సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర సర్కారు మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈడీ చీఫ్ పదవిలో సంజయ్ కుమార్ మిశ్రాను జూలై 31 వరకు కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈడీకి కొత్త చీఫ్ని నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈడీ చీఫ్ గా ఎస్కే మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించడం అనేది 2021లో కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించేలా ఉందని(ED Chief Extension Illegal) సుప్రీంకోర్టు పేర్కొంది.
Also read : Article 370 Hearings : “ఆర్టికల్ 370 రద్దు” సవాల్ పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి విచారణ
గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్ అయిన “ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్” (ఎఫ్ఎటిఎఫ్) పీర్ రివ్యూ ఉందని కేంద్రం చెప్పినందున.. జూలై 31 వరకు ఈడీ చీఫ్ గా సంజయ్ కుమార్ మిశ్రాను కొనసాగించేందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది. 2018 నవంబర్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్గా మిశ్రా నియమితులయ్యారు. 2020 నవంబర్ లో ఆయనకు 60 ఏళ్లు నిండాయి. వాస్తవానికి అప్పుడే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మిశ్రా పదవీ కాలాన్ని మూడుసార్లు పొడిగించింది.
Tags
Related News
Supreme Court : కేజ్రీవాల్కు మినహాయింపు ఇవ్వలేదు.. బెయిల్ మంజూరుపై ‘సుప్రీం’ క్లారిటీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసే విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదని సుప్రీం కోర్టు తెలిపింది.