Smugglers: సినిమా తరహాలో గంజాయి సరఫరా, పోలీసులు ప్రత్యేక నిఘా
- By Balu J Published Date - 02:30 PM, Sat - 10 February 24
పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పాలవ్యాన్ కిందపెట్టుకుని పైన పాలు కనిపించేలా పోలీసులకు కనికట్టు చేసిన తరహాలోనే గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను మేడ్చల్ ఓఎస్ టీ పోలీసులు పట్టుకున్నారుపోలీసులు ఎంత నిఘా ఉంచినా…విశాఖ మన్యం నుంచి గంజాయి సరఫరా అవుతూనే ఉంది. చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు పెంచినా…చేరాల్సిన చోటకు చేరాల్సిన సమయంలో సరుకు వచ్చి చేరుతోంది. పోలీసుల కళ్లుగప్పి వివిధ నగరాలకు మాల్ తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. స్మగ్లర్ల పథకాలు చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. సరిగ్గా అలాంటి అనుభవమే మేడ్చల్పోలీసులకు ఎదురైంది. డీజిల్ కారుకు సీఎన్జీ ట్యాంకు బిగించి అందులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను ఓఎస్ టీ పోలీసులు పట్టుకున్నారు.
పాల ట్యాంకును సగానికి కత్తిరించి అందులో ఎర్రచందనం దుంగలు పేర్చి…పైన రేకుతో కప్పిపెట్ట మళ్లీ పైన పాలట్యాంకు యథావిథిగా ఉండేలా చేసి దుంగలు రవాణా చేస్తారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని గంజాయి స్మగర్లు అవలంభించారు. పోలీసులు ఎన్ని విధాలుగా గంజాయి దాచిపెట్టిన కనిపెట్టేస్తుండటంతో ఇలాంటి పథకానికే శ్రీకారం చుట్టారు. డీజిల్ కారుకు వెనక సీఎన్ జీ ట్యాంకు బిగించారు. దాన్ని కారుకు అనుసంధానం చేసినట్లు వైర్లు, పైపులు మొత్తం సెట్ చేశారు. కారు డీజిల్ తోనే నడుస్తుంది. కానీ ఈ సీఎన్ జీ ట్యాంకు నిండా మొత్తం గంజాయితో నింపేశారు.
పోలీసులు తనిఖీ చేసినా….లోపల గ్యాస్ ఉంటుందనుకుని దాని జోలికి వెళ్లరు. అదే ధైర్యంతో దర్జాగా మెయిన్ రోడ్డుమీదుగానే గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు…విశాఖ మన్యం నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు కారులో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ వద్ద అనుమానాస్పదంగా వస్తున్న కారును ఓఎస్టీ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వారి వ్యవహారం తడబాటు చూసి పోలీసుల అనుమానం మరింత ఎక్కువైంది. కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేయగా….అసలు విషయం బయటపడింది. సీఎన్జీ ట్యాంకులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
Tags
Related News
Cyberabad: డ్రగ్ ను స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు
Cyberabad: సైబరాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ టీం, కూకట్పల్లి పోలీస్ లు కూకట్పల్లి స్టేషన్ పరిధిలో ని శేషాద్రినగర్ లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి 3 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నారు. బెంగళూరు లో పనిచేస్తున్న వీరి మిత్రుడైన ప్రేమ్ సాయి అనే యువకుడు వీరికి సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది కూకట్ పల్లి పోలీసులు విచారిస్తున్నారు. మరొ