Super Typhoon Rai: ఫిలిప్పీన్స్లో తుఫాన్.. 70మందికిపైగా మృతి
ఫిలిప్ఫీన్లో తుపాన్ దాటికి సుమారు 75 మంది మరణించారు. ఈ సంవత్సరం ఫిలిప్ఫీన్స్ తాకిన బలమైన తుపాను 'రాయ్'. అల్లకల్లోలమైన ద్వీపంలోని ప్రజలకు నీరు, ఆహారాన్ని అందించేందుకు ముమ్మురంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
- By Hashtag U Published Date - 10:13 AM, Sun - 19 December 21
ఫిలిప్ఫీన్లో తుపాన్ దాటికి సుమారు 75 మంది మరణించారు. ఈ సంవత్సరం ఫిలిప్ఫీన్స్ తాకిన బలమైన తుపాను ‘రాయ్’. అల్లకల్లోలమైన ద్వీపంలోని ప్రజలకు నీరు, ఆహారాన్ని అందించేందుకు ముమ్మురంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ద్వీపంలోని దక్షిణ, మధ్య ప్రాంతాలపై ఈ తుపాను విరుచుకుపడటంతో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావితమైంది. గ్రామాలన్నీ నీట మునిగాయి. సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు ఇళ్లను, రిసార్ట్లను ఖాళీ చేశారు. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో కూడిన సూపర్ తుపాన్ గురువారం ద్వీపంపై విరుచుకుపడింది. పలువురు గల్లంతు కాగా, సమారు 15 మంది గాయపడినట్లు సమాచారం. సహాయక చర్యల్లో భాగంగా ఆర్మీ, పోలీసు, కోస్ట్గార్డ్, అగ్ని మాపక సిబ్బంది భారీగా చేరుకున్నారు.
Related News
Cyclone Michaung: భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
మైచాంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు