Omicron: 358కి పెరిగిన ఓమిక్రాన్ కేసులు!
- Author : Balu J
Date : 24-12-2021 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
24 గంటల్లో 6,650 కొత్త కోవిడ్ కేసులు, 374 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం రిపోర్ట్ చేసింది. దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 358కి పెరిగింది. కొత్త మరణాల చేరికతో మొత్తం 4,79,133కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 358కి చేరుకుంది. అయితే, మొత్తం ఓమిక్రాన్ పాజిటివ్లో 114 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్ను నివేదించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/w7bTeypumG pic.twitter.com/LIBJ5kaemJ
— Ministry of Health (@MoHFW_INDIA) December 24, 2021