Fishermen Arrest In Srilanka : భారత మత్య్సకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికదళం
శ్రీలంక నావికాదళం తమిళనాడుకు చెందిన ఆరుగురు మత్స్యకారులను అరెస్టు చేసింది. వీరితో పాటు మెకనైజ్డ్ పడవను స్వాధీనం చేసుకుంది.
- By Prasad Published Date - 12:35 PM, Thu - 21 July 22
శ్రీలంక నావికాదళం తమిళనాడుకు చెందిన ఆరుగురు మత్స్యకారులను అరెస్టు చేసింది. వీరితో పాటు మెకనైజ్డ్ పడవను స్వాధీనం చేసుకుంది. బుధవారం రాత్రి మత్య్సకారులను అరెస్టు చేశారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటి శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని బాలమురుగన్ (28), ఆంథోని (31), తనగపాండి (24), అజిత్ (28), కృష్ణన్ (31), ముడుగు పిచాయ్ (51)లుగా గుర్తించారు. అరెస్టు చేసిన వారిని తలైమన్నార్ నేవీ క్యాంపుకు తరలించినట్లు తమిళనాడు తీర ప్రాంత పోలీసు అధికారి తెలిపారు.
బుధవారం రాత్రి రామేశ్వరం నుంచి చేపల వేటకు వెళ్లిన బోట్ల గుంపు తలైమన్నార్, నాచికడవు సమీపంలో చేపల వేట ప్రారంభించింది. శ్రీలంక నేవీకి చెందిన పెట్రోలింగ్ బోట్ రెండు బోట్లలో 11 మంది మత్స్యకారులను పట్టుకుని అరెస్టు చేసింది. అయితే ఒక పడవలోని మత్స్యకారులు తమ పడవ అనుకోకుండా IMBL దాటి శ్రీలంక సముద్ర జలాలకు చేరుకుందని, ఇంజిన్ వైఫల్యం కారణంగా నావికాదళ అధికారులకు తెలియజేయడంతో అరెస్టు చేసిన ఐదుగురిని విడుదల చేశారు. మరొక బోటులో ఉన్న ఆరుగురు మత్స్యకారులు ఇప్పుడు శ్రీలంక నేవీ అదుపులో ఉన్నారు. వారి మెకనైజ్డ్ బోటు కూడా నేవీచే స్వాధీనం చేసుకుంది. మత్స్యకారుల అరెస్టుతో రామేశ్వరం, ధనుష్కోడి ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. రామేశ్వరం మత్స్యకారుల సంఘం నాయకుడు ఆర్.సెల్వకుమార్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో అరెస్టులు, జైలు శిక్షలు విధించడం వల్ల ఇప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లేందుకు భయపడుతున్నారని ఆయన తెలిపారు. తమ ఖరీదైన బోట్లను కూడా సీజ్ చేసి ఓపెన్ టెండర్లో విక్రయిస్తున్నారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
Related News
T20I Player Rankings: టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో సూర్యకుమార్ యాదవ్..!
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో భారత పేలుడు బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.