Sri Lanka: శ్రీలంక అంతటా కర్ఫ్యూ!
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటోన్న శ్రీలంక దేశమంతటా కర్ఫ్యూను విధించారు.
- By CS Rao Published Date - 06:30 PM, Mon - 9 May 22
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటోన్న శ్రీలంక దేశమంతటా కర్ఫ్యూను విధించారు. అధ్యక్షుడు రాజపక్సే కార్యాలయం వెలుపల ప్రభుత్వ అనుకూల గ్రూపులు నిరసనకారులపై దాడి చేయడంతో కనీసం 23 మంది గాయపడిన తర్వాత శ్రీలంక అధికారులు కర్ఫ్యూ విధించారు. ఆర్మీ దళాలను రాజధానిలో మోహరించారు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి మధ్యంతర పరిపాలనను ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆ డిమాండ్ మరింత పెరిగింది. ఒత్తిడి పెంచడంతో మహింద రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా ప్రచారం హింసకు దారితీసింది.
శుక్రవారం జరిగిన ప్రత్యేక క్యాబినెట్ సమావేశంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చేలా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం నెలకొన్ని నెల వ్యవధిలో శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఇది రెండోసారి. 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభం కొంతవరకు విదేశీ కరెన్సీ లేకపోవడం వల్ల ఏర్పడింది. ప్రధాన ఆహారాలు మరియు ఇంధనం దిగుమతుల కోసం చెల్లించలేని పరిస్థితి. ఇది తీవ్రమైన కొరత . అధిక ధరలకు దారితీసింది. వేలాది మంది ప్రదర్శనకారులు ఏప్రిల్ 9 నుండి శ్రీలంక అంతటా వీధుల్లోకి వచ్చారు, ప్రభుత్వం ముఖ్యమైన దిగుమతుల కోసం డబ్బు అయిపోయిందిజ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంధనం, మందులు మరియు విద్యుత్ సరఫరాలో తీవ్రమైన కొరత ఉంది.
Related News
Katchatheevu Island:కచ్చతీవు ద్వీపాన్ని ఆయన వెనక్కి తీసుకుంటారా?”: ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ సవాల్
Katchatheevu Island: భారత భూభాగానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని (Katchatheevu Island) కాంగ్రెస్ ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీలకంకకు కట్టబెట్టింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం బయటపడగా ఆ వివరాలనే ప్రస్తావిస్తూ X వేదికగా పోస్ట్ పెట్టారు ప్రధాని. అప్పటి నుంచి కచ్చతీవు వివాదం మొదలైంది. We’re now on WhatsApp. Click to Join. వివాదాస్పద ద్వీపాన్ని 1974 నాటికి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పజెప్పిందన్న RTI వివరాలు సంచ�