Delhi: గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ…!!
ఈమధ్యే కోవిడ్ బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్లో చేరారు. జూన్ 2న సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు సోనియాగాంధీ హాజరు కావాల్సి ఉంది.
- By hashtagu Published Date - 04:34 PM, Sun - 12 June 22
ఈమధ్యే కోవిడ్ బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్లో చేరారు. జూన్ 2న సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు సోనియాగాంధీ హాజరు కావాల్సి ఉంది. ఈలోగా కోవిడ్ కారణంగా సోనియా ఇంటికే పరిమితమయ్యారు. అయితే కోవిడ్ సంబంధిత సమస్యలతో ఆమె ఇవాళ ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
కాగా ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని…వైద్యులు పరిస్థితిని పరిశీలిస్తున్నందున సోనియా ఆసుపత్రిలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. సోనియా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మెసేజ్ లు పంపిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
Related News
Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
Latest Report: డిప్రెషన్తో బాధపడే వారు చిన్న వయస్సులోనే ఉన్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. వారు పెరిగిన తర్వాత కూడా మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధుల లక్షణాలు మొదట్లో చిన్నవిగా ఉన్నా తర్వాత తీవ్రమవుతాయి. ప్రాథమిక విచారణలో వైద్యులు కూడా వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. ఎయిమ్స్ ఇటీవలి నివేదిక నగరాల్లో వేగ�