7 Tourists Dead: సిక్కింలో ఘోర ప్రమాదం.. భారీ హిమపాతంతో 7 టూరిస్టులు దుర్మరణం!
కొండ చరియలు విరిగి పడటంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.
- By Balu J Published Date - 05:41 PM, Tue - 4 April 23
మంగళవారం మధ్యాహ్నం సిక్కింలోని గ్యాంగ్టక్-నాథు లా రహదారిపై భారీ మంచు కొండ చరియ (హిమపాతం) విరిగి పడటంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు. 12 మందికిపైగా గాయాలైనట్టు, ఐదు-ఆరు వాహనాలతో పాటు 20-30 మంది పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయారని ఆర్మీ తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి, 14 మందిని రక్షించి సమీపంలోని ఆర్మీ వైద్య కేంద్రానికి తరలించారు. అయితే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఏడుగురికి ప్రథమ చికిత్స అందించి తిరిగి గ్యాంగ్టక్కు చేరుకున్నారు అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ ఆర్మీ దళాలు ఆ ప్రాంతంలో రెస్క్యూ మిషన్ను ప్రారంభించాయి. ప్రస్తుతం ఆర్మీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్, పోలీసులు సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లో ఉన్నారు.
Watch | Seven tourists dead, several feared trapped as avalanche hits Nathu La
Read more: https://t.co/BThIH8fzDK pic.twitter.com/gNlasr1Jay
— The Indian Express (@IndianExpress) April 4, 2023
Tags
Related News
Hyderabad: హైదరాబాద్లో అమానుషం.. కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం
హైదరాబాద్ లో అమానుషం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చిత్తు పేపర్లు ఏరుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న ఓ మహిళపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు మృతి చెందింది.