Korean Open-India Win : రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి తడాఖా.. “కొరియా ఓపెన్” ఇండియా కైవసం
Korean Open-India Win : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ "కొరియా ఓపెన్-2023"ను ఇండియా టీమ్ గెల్చుకుంది.
- By Pasha Published Date - 02:20 PM, Sun - 23 July 23
Korean Open-India Win : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ “కొరియా ఓపెన్-2023″ను ఇండియా టీమ్ గెల్చుకుంది. పురుషుల డబుల్స్ టైటిల్ ను సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ కైవసం చేసుకుంది. దక్షిణ కొరియాలోని యోసు నగరంలో ఉన్న జిన్నామ్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం “కొరియా ఓపెన్-2023” ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో వరల్డ్ నంబర్వన్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ ఇండోనేషియా ద్వయం ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోతో మన దేశానికి చెందిన సాత్విక్ – చిరాగ్ జోడీ తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో 17-21, 21-13, 21-14 పాయింట్ల తేడాతో సాత్విక్ – చిరాగ్ జోడీ(Korean Open-India Win) విజయ ఢంకా మోగించింది. కొరియా ఓపెన్ టోర్నీలో పురుషుల డబుల్స్ విజేతలుగా నిలిచిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి రూ.27 లక్షల ప్రైజ్ మనీ దక్కింది.
Also read : Diet Charges Hike: విద్యార్థులకు శుభవార్త…డైట్ చార్జీల ఫైల్ పై సంతకం చేసిన సీఎం కేసీఆర్
బ్యాడ్మింటన్ డబుల్స్ లో వరల్డ్ నంబర్ 3 ర్యాంక్ లో ఉన్న సాత్విక్ – చిరాగ్ జోడీ అంత ఈజీగా ఈ ఫైనల్ కు చేరలేదు. ఫైనల్ కు చేరే ముందు .. సెమీ-ఫైనల్స్లో వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ లో ఉన్న చైనా జంట లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్లను చెమటోడ్చి ఓడించాల్సి వచ్చింది. “కొరియా ఓపెన్ 2023” ఫలితాలను “పారిస్ ఒలింపిక్స్-2024″కు భారత
బ్యాడ్మింటన్ ఆటగాళ్ల అర్హత కోసం పరిగణనలోకి తీసుకోనున్నారు.
Also read : Electric Shock : సూర్య ఫై అభిమానం ఇద్దరి ప్రాణాలు పోయేలా చేసింది
Tags
Related News
Gold In Badminton : ‘ఏషియన్ గేమ్స్’లో కొత్త రికార్డు.. బ్యాడ్మింటన్ లో భారత్ కు తొలి గోల్డ్
Gold In Badminton : ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నెగ్గిన మొట్టమొదటి తొలి గోల్డ్ మెడల్ (Gold Medal) ఇదే.