Farmers protest: వాళ్లేమైనా నాకోసం చనిపోయారా- నరేంద్రమోదీ
- By hashtagu Published Date - 05:08 PM, Mon - 3 January 22

రైతు సమస్యలపై మాట్లాడానికి వెళ్లినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా అహంకారపూరితంగా మాట్లాడారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. హర్యానాలోని దాద్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ.. ‘‘నేను ప్రధానమంత్రి మోదీని కలిసి రైతు సమస్యల గురించి మాట్లాడాను. మన రైతులు 500 మంది చనిపోయారని చెప్పినప్పుడు ‘వాళ్లేమైనా నాకోసం చనిపోయారా?’ అని చాలా అహంకారంగా మాట్లాడారు’’ అని మాలిక్ అన్నారు.
ఆ విషయం పై కొద్ది సమయం మోదీతో తాను యుద్ధమే చేశానని సత్యపాల్ మాలిక్ చెప్పుకొచ్చారు. అనంతరం మోదీకి బదులిస్తూ ‘‘అవును, కొంత కాలంగా ఈ దేశాన్ని పాలిస్తుంది మీరే అని మోదీకి సమాధానం చెప్పాను. ఏదైతేనేమి, కొంత సమయానికి మా యుద్ధం ముగిసింది. అయితే అమిత్ షాను కలవమని ఆయన నాకు చెప్పారు.