HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sabarimala Temple Slams Rumours About Woman Who Visited Temple With Chiranjeevi

Chiranjeevi: చిరంజీవితోపాటు శబరిమలకు వెళ్లిన ఆ మహిళ ఎవరు? అసలు నిజమేంటి?

మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ఘటనలో ఓ వివాదం చోటుచేసుకుంది. చిరుతోపాటు మరికొంతమంది కూడా దర్శనానికి వెళ్లారు. వారిలో ఓ మహిళ వయసు 55 ఏళ్ల లోపు ఉంటుందని..

  • Author : Hashtag U Date : 17-02-2022 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiru
Chiru

మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ఘటనలో ఓ వివాదం చోటుచేసుకుంది. చిరుతోపాటు మరికొంతమంది కూడా దర్శనానికి వెళ్లారు. వారిలో ఓ మహిళ వయసు 55 ఏళ్ల లోపు ఉంటుందని.. అలాంటప్పుడు ఆలయ వర్గాలు ఆవిడను దర్శనానికి ఎలా అనుమతించారన్నది వివాదం. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆలయ వర్గాలు దీనిపై వివరణ ఇచ్చాయి. చిరంజీవి దంపతులతో పాటు వచ్చినవారు సురేష్ చుక్కపల్లి, ఆయన సతీమణి మధుమతి చుక్కపల్లి అని.. ఆమె వయసు 55 ఏళ్ల కన్నా ఎక్కువే అని క్లారిటీ ఇచ్చాయి.

శబరిమల ఆలయ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం 10 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల లోపువారికి ఆలయ ప్రవేశానికి, అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉండదు. కానీ చిరంజీవి దంపతులతోపాటు వచ్చిన మహిళ వయసు 55 ఏళ్ల లోపే అని సోషల్ మీడియాలో ప్రచారం చోటుచేసుకోవడంతో వివాదం మొదలైంది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆలయ వర్గాలు తేల్చి చెప్పాయి.

అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 13న శబరిమల ఆలయానికి వెళ్లిన చిరు.. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చిరు దంపతులతోపాటు ఉన్న మధుమతి చుక్కపల్లి వయసు 55 ఏళ్ల లోపు ఉంటుందని భావించిన నెటిజన్లు… శబరిమల ఆలయ నిర్వాహకులు కట్టుబాట్లు దాటారని.. ఆ మహిళను ఎలా అనుమతించారంటూ ప్రచారం చేశారు. ఇది పెద్ద సమస్యగా మారింది. నిజానికి మధుమతి చుక్కపల్లి చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ కేంద్రంగా బిజినెస్ చేసే ఫినిక్‌ గ్రూప్ ఛైర్మన్ సురేష్ చుక్కపల్లి భార్యగా, ఆ గ్రూప్ మాజీ డైరెక్టర్ గా సుపరిచితురాలే.

మధుమతి చుక్కపల్లి వయసు 50 ఏళ్ల లోపు ఉన్నా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారన్న సోషల్ మీడియా ప్రచారం పెరగడంతో.. ఆమె కుమారుడు చుక్కపల్లి అవినాష్ దీనిపై ఫేస్ బుక్ లో క్లారిటీ ఇచ్చారు. ఆమె తన తల్లి అని, ఆమె 1966లో పుట్టారని చెప్పారు. 2017లోనే శబరిమల అయ్యప్పకు కూడిమర్మం విరాళంగా ఇచ్చామని చెప్పుకొచ్చారు. తన వయసు 34 ఏళ్లని అన్నారు. ఈ సమస్యకు పూర్తిగా వివరణ ఇచ్చినందున ఇకపై అసత్య ప్రచారాన్ని ఆపాలని కోరారు.

శబరిమల ఆలయ నిర్వహణను చూసే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కూడా దీనిపై వివరణ ఇచ్చింది. ఈ ఆన్ లైన్ అసత్య ప్రచారం.. ఆలయానికి వ్యతిరేకంగా జరుగుతోందంటూ ఆవేదన చెందింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి చిరంజీవితోపాటు వచ్చినవారి వయసు 55 ఏళ్ల కన్నా ఎక్కువే అని.. దయచేసి దీనిపై అసత్య ప్రచారాన్ని ఆపాలని కోరింది. మధుమతి చుక్కపల్లి వయసుపై వివాదం చోటుచేసుకోవడంతో మరొక విషయం కూడా చెప్పారు. మధుమతి తన ఆధార్ కార్డును కూడా చూపించారని ఆ తరువాతే ఆలయానికి వెళ్లారన్నారు. ఆమె గతంలో కూడా అయ్యప్పను దర్శించుకున్నారని చెప్పారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. చట్టపరంగా అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. మొత్తానికి అలా ఈ వివాదానికి అటు చుక్కపల్లి కుటుంబం నుంచి ఇటు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నుంచి వచ్చిన వివరణలు ఫుల్ స్టాప్ పెట్టాయి.

Visiting #sabarimalatemple #feelingblessed pic.twitter.com/kdtfxXszcl

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 13, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • controversy
  • kerala
  • Sabarimala Ayyappa temple
  • sabrimala

Related News

Mana Shankara Varaprasad Garu

తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్‌ ధరల పెంపు

Mana Shankara Varaprasad Garu మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నెల 11న ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే, జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరక

  • Mana Shankara Varaprasad Pr

    ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

  • Mana Shankara Varaprasad Pr

    ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు చిరంజీవి దూరం ? కారణం అదేనా ?

  • Mana Shankara Vara Prasad Garu

    మన శంకర వర ప్రసాద్ గారు ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. వెంకీ మామ ఎంట్రీ అదుర్స్‌!

Latest News

  • జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ

  • న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

  • రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే

  • అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

  • సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఇది సాధ్యమేనా?

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd