Corruption: ఇంట్లో రూ,20 లగ్జరీ కార్లు., రూ.30 లక్షల టీవీ.. ఈ ఉద్యోగి అవినీతి గురించి వింటే షాక్ అవుతారు
దేశంలో అవినీతి అధికారులు ఎప్పుడూ సీబీఐ, ఏసీబీ లాంటి దర్యాప్తు సంస్థలకు పట్టుడుతూనే ఉంటారు. తాజాగా మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ అధికారిణి పట్టుబడింది. ఆమె అవినీతి చిట్టా చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు.
- By Nakshatra Published Date - 08:03 PM, Fri - 12 May 23
Corruption: దేశంలో అవినీతి అధికారులు ఎప్పుడూ సీబీఐ, ఏసీబీ లాంటి దర్యాప్తు సంస్థలకు పట్టుడుతూనే ఉంటారు. తాజాగా మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ అధికారిణి పట్టుబడింది. ఆమె అవినీతి చిట్టా చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ శాఖలో చిన్న ఉద్యోగిగా చేరిన ఆమె.. కేవలం 10 ఏళ్లలోనే రూ.కోట్లు సంపాదించింది. ఆమె ఇంట్లో మొత్తం 20 వాహనాలు ఉండగా 10 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక ఖరీదైన వస్తువులతో పాటు 100 శునకాలు ఉన్నాయి.
ఈ ఉద్యోగి ఆస్తులు, లగ్జరీ కార్లు చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. ఒక చిన్న ఉద్యోగి ఇంత ఎలా సంపాదించిదనేది అర్ధం కాక తలలు పట్టుకున్నారు. భోపాల్కు చెందిన మీనా అనే ఉద్యోగి ఇంట్లో ఒక రోజుల పాటు ఆమె ఇంట్లో తనిఖీలు చేశారు. రూ.7 కోట్ల విలువైన ఆస్తులను బయటకు తీశారు. రూ.30 లక్షల విలువ చేసే 98 అంగుళాల అత్యాధునీక టీవీ సెట్ తో పాటు మొబైల్ జామర్స్, వైర్ లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ వంటి వాటిని గుర్తించారు.
20కిపైగా మేలు జాతి పశువులతో పాటు భారీ వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమెకు వ్యవసాయ భూములు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు వచ్చే ఆదాయం కంటే ఆస్తి 232 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రూ.కోటి లగ్జరీ విల్లా నిర్మించినట్లు గుర్తించారు.
2011లో మీనా ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ విభాగంలో చేరారు. ప్రస్తుతం ఆమె ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఇంజినీర్ గా నిధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె జీతం రూ.30 వేలు. ఆమెకు ఇంత ఆదాయం ఎలా వచ్చిందనే దానిపై అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మంచిన ఆస్తులు ఉన్నాయని 2020లో ఆమెపై ఏసీబీకి ఫిర్యాదు అందింది.
Related News
Dharmavaram Public Meeting: గూండారాజ్యాన్ని తరిమికొట్టేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయి: అమిత్ షా
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి అవినీతి, నేర, మాఫియా, మతమార్పిడి రాజకీయాలపై పోరాడేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన ధర్మవరంలో చంద్రబాబుతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.