Ukraine Indians: ఉక్రెయిన్ సంక్షోభం.. భారత విద్యార్థులకు ఆహారం,వసతి కల్పిస్తున్న రొమేనియన్ ప్రభుత్వం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం వల్ల చాలామంది భారతీయ విద్యార్థులు తీవ్రిఇబ్బందులకు గురవుతున్నారు.
- By Hashtag U Published Date - 08:56 AM, Sat - 26 February 22
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం వల్ల చాలామంది భారతీయ విద్యార్థులు తీవ్రిఇబ్బందులకు గురవుతున్నారు. ఉక్రెయిన్ నుండి తరలిస్తున్న భారతీయ విద్యార్థులకు తమ దేశం ఆహారం, వసతి కల్పిస్తుందని ఢిల్లీలోని రొమేనియా రాయబారి డానియెలా-మరియానా సెజోనోవ్ తెలిపారు.
రొమేనియన్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులకే కాకుండా ఉక్రెయిన్ నుండి వచ్చే భారతీయ పౌరులకు కూడా భోజన వసతితో రెండు రోజుల పాటు సహాయాన్ని అందించిందని రాయబారి డానియెలా తెలిపారు. భారతదేశం నుండి కాన్సులర్ బృందాలు బహుశా దేశంలోని ఉత్తరాన ఉక్రెయిన్తో సరిహద్దుకు చేరుకున్నాయని..ఆ బృందాలు విద్యార్థులకు బుకారెస్ట్ చేరుకోవడానికి సహాయపడతాయన్నారు. బుకారెస్ట్ నుండి భారతదేశానికి భారత ప్రభుత్వం ద్వారా విమానాలు ఏర్పాటు చేయబడతాయని డానియేలా పేర్కొన్నారు.
రొమేనియాలో శరణార్థుల కోసం ఒక సంక్షోభం సెల్ను సిద్ధం చేస్తోందని ఎంతమంది ఉంటారో తమకు తెలియదని అన్నారు. శుక్రవారం తొలి బ్యాచ్ భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి సుసీవా సరిహద్దు మీదుగా రొమేనియా చేరుకున్నారని డానియోలా తెలిపారు. సుసెవాలోని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బృందాలు విద్యార్థులు దేశానికి తిరుగు ప్రయాణం కోసం బుకారెస్ట్కు ప్రయాణాన్ని సులభతరం చేయనున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్లో సంక్షోభం, భారతీయ పౌరుల తరలింపుపై దృష్టి సారించి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రొమేనియన్ తో సహా అనేక మంది తూర్పు యూరోపియన్ విదేశాంగ మంత్రులతో గురువారం మాట్లాడారు.
Related News
NASA : నాసా అవార్డులను గెలుచుకున్న భారతీయ విదార్థులు
NASA: అహ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ కోసం ఢిల్లీ మరియు ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల(Indian students) బృందాలు నాసా(NASA)నుండి అవార్డులను గెలుచుకున్నాయి. అలబామా రాష్ట్రంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అ�