2 Killed : కలపర్రు టోల్గేట్ వద్ద కారు బోల్తా.. ఇద్దరు మృతి
ఏపీలోని ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జిల్లాలోని పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద కారుబోల్తా
- By Prasad Published Date - 09:40 PM, Sun - 23 July 23
ఏపీలోని ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జిల్లాలోని పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద కారుబోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఏలూరు నుంచి గుడివాడ వెళ్తున్న కారు జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో శారద (66), డ్రైవర్ శ్రీను (45) ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసే నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Tags
Related News
Rayapati Aruna : ప్రమాదానికి గురైన రాయపాటి అరుణ..జనసేన శ్రేణుల్లో ఆందోళన
ఆమె ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం వద్ద డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి