4 Killed : చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం గ్రామంలో ఈ
- By Prasad Published Date - 07:27 AM, Fri - 17 February 23
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని హయత్నగర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతులు డి.నాగలక్ష్మి (28), వరకంఠం అనసూయ (55), చిలువేరు ధనలక్ష్మి (35), దేవరపల్లి శిరీష (30)గా గుర్తించారు. బాధితులు ఓ కంపెనీ ఇండస్ట్రియల్ పార్కులో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మరో కూలీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 12 మంది కూలీలు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags
Related News
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..