Revanth Reddy: మిస్టర్ కేటీఆర్.. కాంగ్రెస్ నిబద్ధత తెలుసుకో!
కేసీఆర్ ప్రభుత్వం పేదలను లూటీ చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
- By Balu J Published Date - 04:22 PM, Wed - 30 March 22
కేసీఆర్ ప్రభుత్వం పేదలను లూటీ చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి భారత్లో ఇక్రిశాట్ సంస్థను కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.1,259 కోట్లతో రైతుల కరెంటు బకాయిలను కాంగ్రెస్ మాఫీ చేసిందని గుర్తు చేశారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ను కాంగ్రెస్ అందించిందని తెలిపారు.
11 లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ పార్టీ పూర్తి చేయలేదని ఆరోపించారు. రేవంత్రెడ్డి ట్విట్టర్లోకి వెళ్లి ‘‘మిస్టర్.. కేటీఆర్, రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్కు ఉన్న నిబద్ధత మీకు తెలియకపోవడం బాధాకరం. మా సహకారాల గురించి మీ తండ్రిని అడగడం మంచిది. రాజకీయాలు పక్కన పెట్టి.. రైతు సమస్యలను పరిష్కరించండి’’ అంటూ చురకలంటించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 4 కోట్ల మంది 60 ఏళ్ల కలను నెరవేర్చాం. మేం రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ ఇస్తుంటే, మీ ప్రభుత్వం రైతులను చంపుతోంది. ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మీ ప్రభుత్వం నిరాకరించడంతో పాటు బీజేపీతో ఫిక్సెడ్ బ్లేమ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అంటూ టీఆర్ఎస్ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mr. KTR,
It’s a pity that you’re unaware of Congress’s commitment to the welfare of farmers.
Better ask your father about our contributions.
Oh, he might be busy playing politics with farmer issues instead of resolving them..!
(1/4)
— Revanth Reddy (@revanth_anumula) March 30, 2022
Related News
Pakistan Reaction: కేజ్రీవాల్ విడుదలతో పాకిస్థాన్ లో సంబురాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్త పాకిస్థాన్ లోనూ హల్ చల్ చేసింది. పాకిస్థాన్ మీడియా డాన్ ఈ వార్తను ప్రచురించింది.కేజ్రీవాల్ను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం విడుదల చేసింది. ఇది మోడీ ప్రభుత్వ ఓటమి అంటూ పాక్ నేతలు కూడా సంబరాలు చేసుకున్నారు.