KTR: కల్లు సొసైటీలను కాపాడాలంటూ కేటీఆర్ కు వినతి
- By Balu J Published Date - 06:23 PM, Sat - 11 November 23
KTR: హైదరాబాద్ లోని కల్లు సొసైటీలను కాపాడాలని కోరుతూ మున్సిపల్, ఐటి శాఖా మాత్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని ప్రగతి భవన్ లో శనివారం తెలంగాణ గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ లోని 69 కల్లు సొసైటీలపై ఇటీవల జరిగిన నార్కోటిక్స్ అధికారుల దాడుల గురించి వివరించారు. ఈ విషయయంపై ఇప్పటికే ఎక్సయిజ్ కమిషనర్, డిజిపి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, నగర కమిషనర్ లను కలిసి వినతి పత్రాలను అందజేసినట్లు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. నార్కోటిక్స్ అధికారులు పోలీస్, సీఆర్పీఎఫ్ అధికారులతో కలిసి ఆయుధాలతో దాడులు జరిపితే తామేమన్నా ఉగ్రవాదులమా అని గౌడ్స్ అంతా భయభ్రాంతులకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేసినట్టు కేటీఆర్ కి వివరించారు. దీని పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ పదేళ్లు గౌడ్స్ ని కడుపులో పెట్టుకొని చూశామన్నారు.
గౌడ్స్ కష్టాలను రాకుండా చూశామన్నారు. ఈ దాడుల వెనుక జాతీయ పార్టీల కుట్ర దాగి ఉందన్నారు. గౌడ్స్ అంతా బిఆర్ఎస్ వెంట వున్నారని తలచి దాడులతో భపెట్టిస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. గౌడ్స్ ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ మాట్లాడుతూ 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు సొసైటీలను మూసివేస్తే వాటిని తెరిపించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. గౌడ్స్ కోసం అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 20 కోట్ల రూపాయల రెంటల్స్ రద్దు చేశారన్నారు. హరిత హారంలో భాగంగా 4 కోట్ల మొక్కలు నటించారన్నారు. నీరా కేఫ్ ఏర్పాటు చేసి కల్లు గౌరవం పెంచారన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్దంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందన్నారు. వైన్స్ ల్లో గౌడ్స్ కి 15 శాతం రిజర్వేషన్లు. గౌడ్స్ ఆత్మగౌరవ భవనం కోసం కోకపేటలో 5 ఎకరాలు మరియు రూ.5 కోట్లు ఈ ప్రభుత్వమే అందించిందన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాలు గౌడ్స్ కి అందుతుండడంతో గౌడ్స్ బిఆర్ఎస్ వెంట వున్నారని అన్నారు. గౌడ్స్ ని భయభ్రాంతులతో బిఆర్ఎస్ పార్టీ కి దూరం చేయాలన్న కుట్ర కొన్ని పార్టీలు పాల్పడుతున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా బిఆర్ఎస్ పార్టీ వెంటే గౌడ్స్ వున్నారని స్పష్టం చేశారు. గౌడ్స్ మేలు కోరే ప్రభుత్వం బిఆర్ఎస్ అని గౌడ్స్ మద్దతు బిఆర్ఎస్ కేనని పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ పేర్కొన్నారు.
Tags
Related News
KTR: పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలపై కేటీఆర్ ధీమా.. పార్టీ నేతలకు ధన్యవాదాలు
KTR: ఈ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన క్షేత్రస్థాయి భారత రాష్ట్ర సమితి శ్రేణులు అందరికీ, పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎదురుదెబ్బలు ఎన్ని కొట్టావు అన్నది కాకుండా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సవాళ్లు ఎదుర్కొనీ తిరిగి నిలబడి పోరాటం చేశామన్నదే ముఖ్యం అన్న నానుడిని నిజం చేసిన ప