Putin: నియో నాజీల నుంచి రష్యాను కాపాడటం కోసమే ఉక్రెయిన్ తో యుద్ధం..విక్టరీ డేలో పుతిన్..
ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా నేడు 77వ విక్టరీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
- By Hashtag U Published Date - 06:34 PM, Mon - 9 May 22
ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా నేడు 77వ విక్టరీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది మే 9న రష్యా విక్టరీ డే జరుపుకుంటుంది. విక్టరీ పరేడ్లో భాగంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఉపన్యాసం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్పై తీసుకున్న చర్యను పుతిన్ కూడా సమర్థించారు. రష్యా విజయ దినోత్సవం సందర్భంగా పుతిన్ నాటో కూటమిపై కూడా విమర్శలు చేశారు. నాటో సరిహద్దుల అవతల నుంచి రష్యాకు ముప్పు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ తమపై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని కూడా బెదిరించిందని ఆయన అన్నారు.
విక్టరీ డే సందర్భంగా, పుతిన్ మరిన్ని విషయాలు మాట్లాడుతూ,ఉక్రెయిన్పై సైనిక చర్య ఒక్కటే సరైనదని సమర్థించారు. ఉక్రెయిన్పై చర్య తీసుకోవాలని సార్వభౌమాధికార, స్వతంత్ర దేశంగా తీసుకున్న నిర్ణయంగా పుతిన్ పేర్కొన్నారు. నియో నాజీలతో రష్యాకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశ ప్రజలను రక్షించడం కోసమే ఈ సైనిక చర్య అని పుతిన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రష్యా విజయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటుంది?
రష్యా విక్టరీ డే రెండవ ప్రపంచ యుద్ధంతో ముడిపడి ఉంది. మే 9, 1945 అర్ధరాత్రి, రెండవ ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసిన రోజు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయాన్ని స్మరించుకునేందుకు రష్యా తన వార్షిక విక్టరీ డేని, మే 9న జరుపుకుంటోంది. మొదటి విక్టరీ డే పరేడ్ జూన్ 24, 1945 న జరిగింది.
రష్యన్ సైనికులు మాస్కో కోసం హిట్లర్ సైన్యం నాజీలతో పోరాడటమే కాకుండా, లెనిన్గ్రాడ్, స్టాలిన్గ్రాడ్ లాంటి నగరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయానికి చిహ్నంగా మాస్కో రెడ్ స్క్వేర్లో అద్భుతమైన విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తారు.
విక్టరీ డే పరేడ్లో రష్యా అధికార ప్రదర్శన
ఈ ఏడాది కూడా ఇదే సందర్భంగా విక్టరీ డే పరేడ్ను నిర్వహించారు. మాస్కోలోని రెడ్ స్క్వేర్లో దీన్ని నిర్వహించారు. 2020 సంవత్సరంలో, కరోనా మహమ్మారి కారణంగా, విక్టరీ డే పరేడ్ను మే 09కి బదులుగా జూన్ 24న నిర్వహించారు.
Related News
PM Modi: మా దేశాల్లో పర్యటించండి…మోడీకి పుతిన్, జెలెన్స్కీ ఆహ్వానం
Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War)నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) బుధవారం ఇరు దేశాధినేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్(Russian President Putin), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky, President of Ukraine) ప్రధానిని ఎన్నికల తర్వాత(After election) తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. Spoke with President Putin and congratulated him on his re-election as the President of the Russian […]