PM Narendra: ది కేరళ స్టోరీ సినిమాకు మద్దతు తెలిపిన మోడీ.. కర్ణాటక పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ?
ఇటీవలె ది కేరళ స్టోరీ సినిమా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ అప్పటినుంచి ఈ సినిమాపై కాంట్రవర్సీ ల
- By Nakshatra Published Date - 06:53 PM, Fri - 5 May 23
ఇటీవలె ది కేరళ స్టోరీ సినిమా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ అప్పటినుంచి ఈ సినిమాపై కాంట్రవర్సీ లు,విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సినిమాపై సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ ఈ సినిమాపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తమ రాష్ట్రం గురించి ఈ సినిమాలో తప్పుగా చూపించారని, కావాలనే తమపై ధ్వేషంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేరళ వ్యాప్తంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో చేసేదేమీ లేక గురువారం కొచ్చిలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న పీవీఆర్ సినిమాస్ షోను అర్ధాంతరంగా రద్దు చేసింది. మరోవైపు చిత్ర నిర్మాత, దర్శకులు మాత్రం కేరళ స్టోరీ అనే సినిమాను వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించామని చెబుతున్నారు. కేరళకు చెందిన 32 వేల మంది అమ్మాయులు మతం మార్చుకుని సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కానీ ఇది పూర్తిగా అసత్యమని, విద్వేషంతో రూపొందించిన చిత్రమని కేరళ సహా దేశంలోని పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఉగ్ర కుట్రల ఆధారంగా తీశారని, తీవ్రవాదానికి సంబంధించిన చేదు నిజాన్ని ఈ చిత్రంలో చూపించారని పేర్కొన్నారు. అంతే కాకుండా కర్ణాటక బల్లారీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయం గురించి స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ది కేరళ స్టోరీ చిత్రం పై తొలిసారి స్పందిస్తూ దానికి మద్దతు తెలిపారు. కొద్ది రోజులుగా ది కేరళ స్టోరీ చిత్రంపై పెద్ద చర్చ జరుగుతోంది. కేరళలో ఉగ్ర శక్తుల గురించి ఈ చిత్రం బహిర్గతం చేసింది. ఉగ్రవాదం గురించి తెలియజేసింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయల కోసం కాంగ్రెస్ ఉగ్ర శక్తులకు మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు ఉగ్రశక్తులతో ఆ పార్టీ గట్టుగా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి అని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
Related News
SIT Launches Helpline: లైంగిక బాధితుల కోసం సిట్ హెల్ప్లైన్ నంబర్
హసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు బాధిత మహిళలు స్వయంగా ప్రత్యేక దర్యాప్తు శాఖను సంప్రదించి తమ బాధలను చెప్పుకునే అవకాశం కల్పించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్.