Jana Sena: ‘పవన్’ ఔదార్యం… బీమా లేకున్నా మరణించిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల సాయం..!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి జనసైనికులంటే ప్రాణప్రదం. వారికి కష్టమొస్తే ఆదుకోవడానికి ఆయన ఏమాత్రం వెనుకాడరన్న సంగతి అందరికీ తెలిసిందే.
- By Hashtag U Published Date - 08:40 PM, Sat - 5 March 22
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి జనసైనికులంటే ప్రాణప్రదం. వారికి కష్టమొస్తే ఆదుకోవడానికి ఆయన ఏమాత్రం వెనుకాడరన్న సంగతి అందరికీ తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం నియోజకవర్గం, జనుపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త తవిటికి వెంకటేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
దురదృష్టవశాత్తు వెంకటేష్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోలేకపోయారు. జనసేన పార్టీలో మొదటి నుంచి నిబద్ధత కలిగిన కార్యకర్తగా సేవలు అందించిన వెంకటేష్ అణగారిన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. పార్టీ నాయకుల ద్వారా వెంకటేష్ కుటుంబ ధైన్య స్థితిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చలించి పోయారు. జనసైనికులను తన కుటుంబ సభ్యులుగా భావించే పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వం లేనప్పటికీ, బీమా సదుపాయం ఉన్న సభ్యులకు అందించే విధంగా రూ. 5 లక్షలు వెంకటేష్ కుటుంబానికి అందించి ఆదుకోవాలని నిర్ణయించారు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు త్వరలోనే రూ. 5 లక్షల చెక్కును అందించనున్నారు.
Related News
AP : ఓటర్ల ప్రేమకు జనసేనాధినేత ఫిదా..
సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ది, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు. అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది