The Nakba: పాలస్తీనా ప్రజలను 75 ఏళ్లుగా వెంటాడుతున్న పీడకలలు.. అసలేం జరిగిందంటే?
మాములుగా మనం మన ఊరు విడిచి వేరే ఊరికి వెళ్లాలి అంటేనే ఆలోచిస్తూ ఉంటాము. ఎవరైన బంధువుల ఇంటికి చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు ఇంట
- By Nakshatra Published Date - 08:15 PM, Wed - 24 May 23
మాములుగా మనం మన ఊరు విడిచి వేరే ఊరికి వెళ్లాలి అంటేనే ఆలోచిస్తూ ఉంటాము. ఎవరైన బంధువుల ఇంటికి చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి తిరిగి వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాము. అటువంటిది పుట్టి పెరిగిన గడ్డ నుంచి యాకుబ్ది ప్రజలను తరిమేశారు. కేవలం ఒక్క యాకుబ్ది మాత్రమే కాకుండా ఏడున్నర లక్షల మంది పరిస్థితి ఇదే. కాగా పాలస్తీనాలోని ఒక చిన్న పల్లె యాకుబ్ ది. అక్కడ ఒక వంద ఇళ్లు ఉంటాయి. పచ్చటి కొండను ఆనుకుని కట్టుకున్న రాతి ఇళ్లను దూరం నుంచి చూస్తే ఒక అందమైన కాన్వాస్ లా కనిపిస్తుంది.కానీ ఆ పరిస్థితి 1948 వరకే మాత్రమే. ఎందుకంటె ఒక్క ఈ ఊరే కాదు.
పక్కనే ఉన్న బోలెడు పల్లెల్లో కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు పిల్లాపాపలతో కళకళలాడిన ఊర్లన్నీ కూడా మొత్తం ఖాళీ అయ్యాయి. అప్పటివరకు రాజులా బతికిన వాళ్లంతా శరణార్థులుగా మారిపోయారు. ఈ దుస్థితినే వాళ్లు నక్భా అంటారు. 1948లో ఇజ్రాయిల్ ఏర్పాటు తర్వాత పాలస్తీనాలో చాలా ఊళ్లు నిర్మానుష్యమయ్యాయి. కనిపించిన వాళ్లందరనీ తరిమేశారని యాకుబ్ లాంటి వాళ్లు చెబుతుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా తన సొంత గడ్డను చూసుకోడానికి వస్తారు. ప్రతీ ఏటా ఇక్కడికి వచ్చే యాకుబ్లో ఇంకా ఆశ మిణుకు మిణుకు మంటూనే ఉంది.
ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన ఈ ఊళ్లన్నీ కూడా ఇప్పుడు ఒక రిజర్వ్ ప్రాంతాలుగా మారిపోయాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటి మధ్య ఇంకా అందంగా కనిపిస్తోన్న ఆనాటి రాతి కట్టడాలు ఇవే యాకుబ్ లాంటి వారికి ఆక్సిజన్. 75 ఏళ్ల కిందినాటి తీపి గుర్తులను నెమరేసుకుంటూ జీవితాన్ని సాగదీస్తున్నారు. 75 ఏళ్లుగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. కనిపించిన వాళ్లందరికీ ఇదే నా ఇల్లు, ఇక్కడే నేను పుట్టాను, ఇక్కడే ఆడుకున్నాను అంటూ చూపిస్తాడు యాకుబ్.
Related News
Palestina PM: గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా: పాలస్తీనా ప్రధాని రాజీనామా
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యా ఈరోజు రాజీనామా చేశారు. అధ్యక్షుడు ముహమ్మద్ అబ్బాస్కు తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు .