Owaisi: హిజాబ్ విషయంలో పాకిస్తాన్ మంత్రికి కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఓవైసీ
హిజాబ్ ఆందోళన దేశం దాటి ప్రపంచదేశాలకు పాకుతోంది. పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ ట్విటర్ వేదికగా హిజాబ్ ఆందోళనలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
- By Siddartha Kallepelly Published Date - 08:11 PM, Wed - 9 February 22
హిజాబ్ ఆందోళన దేశం దాటి ప్రపంచదేశాలకు పాకుతోంది. పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ ట్విటర్ వేదికగా హిజాబ్ ఆందోళనలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. హిజాబ్ ధరించారనే కారణంతో మహిళలను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని, ఇది ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘన అని ఖురేషీ విమర్శించారు. హిజాబ్ ధరించిన విద్యార్థులను బయపెట్టడం వారిని అణిచివేయడం లాగే చూడాలని, ముస్లింలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఇండియన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఖురేషీ అభిప్రాయపడ్డారు.
పాక్ మంత్రికి హైదారాబాద్ ఎంపీ, ఏంఐఏం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ గట్టి కౌంటర్ ఇచ్చారు. హిజాబ్ అంశం తమ సమస్య అని దాన్ని తామే పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బాలికల విద్యపై పాకిస్తాన్ మాకు పాఠాలు చెప్పాల్సిన పనిలేదని అసద్ తెలిపారు. చదువుకుంటానని ముందుకు వచ్చిన ముస్లిం విద్యార్థి మాలాలాపై పాకిస్తాన్ లోనే దాడిచేశారని ఆయన గుర్తు చేశారు. మహిళకు హిజాబ్ రాజ్యాంగం కల్పించిన హక్కని, ఆ హక్కు కోసం తామే పోరాటం చేస్తామని అసద్ తెలిపారు. హిజాబ్ హక్కు కోసం పోరాడే వారికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని, హిజాబ్ విషయంలో కర్నాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దమైన నోటిఫికేషన్ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అసద్ తెలిపారు.
మరోవైపు హిజాబ్ అంశం అన్నీ రాష్ట్రాలను తాకుతోంది. తెలంగాణలోనూ ఈ అంశంపై పలుచోట్ల ముస్లిం మహిళలు నిరసనలు తెలిపారు. కర్నాటకలోని ఒక విద్యాసంస్థలో హిజాబ్ ధరించిన ముస్కాన్ అనే అమ్మాయిపైకి హిందుత్వవాదులు నినాదాలిస్తూ బయపెట్టడాన్ని ప్రజాస్వామికవాదులు ఖండిస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం కొందరు కావాలని ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని అమాయకపు యువత ఈ కుట్రలకు బలికావొద్దని పలువురు సూచిస్తున్నారు.
Related News
Elections 2024 : ఓటువేసిన వెంకయ్యనాయుడు, జగన్, చంద్రబాబు, ఒవైసీ
Elections 2024 : తెలంగాణ, ఏపీలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.