Russia: ఒడెస్సా నగరంలో చర్చిని నేలమట్టం చేసిన రష్యా.. ఉక్రెయిన్ పై ఆగని దాడులు?
ఉక్రెయిన్, రష్యా మధ్య దాడులు ప్రతి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ దేశంపై రష్యా వరుసగా దాడులు నిర్వహిస్తూనే ఉంది. కాగా ఇప్పటిక
- By Nakshatra Published Date - 04:55 PM, Sun - 23 July 23
ఉక్రెయిన్, రష్యా మధ్య దాడులు ప్రతి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ దేశంపై రష్యా వరుసగా దాడులు నిర్వహిస్తూనే ఉంది. కాగా ఇప్పటికే రష్యా దాడిలో ఉక్రెయిన్ లో భారీగా ప్రాణం నష్టం ఆస్తి నష్టం నెలకొన్న తెలిసిందే. అయినా కూడా రష్యా,ఉక్రెయిన్ పై దాడులు మాత్రం ఆపడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉక్రెయిన్ లోని ఒడెస్సా నగరంలో ప్రముఖ చర్చిని రష్యా నేలమట్టం చేసింది. తాజాగా ఉక్రెయిన్ నగరంపై జరిగిన దాడుల్లో పురాతన చర్చితో సహా ఆరు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. ఈ చర్చి దేశంలోని ప్రముఖ నిర్మాణ చిహ్నాల్లో ఒకటని ఉక్రెయిన్ దక్షిణ ఆపరేషనల్ కమాండ్ పేర్కొంది.
డజన్ల కొద్దీ కార్లు, అనేక భవనాల ద్వారాలు, కిటికీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అని ఆ కమాండ్ టెలిగ్రామ్ ఛానల్లో పేర్కొంది. రష్యా దాడుల కారణంగా నగరంలో విద్యుత్తు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని తెలిపింది. అంతేకాకుండా పలు ప్రజారవాణా వ్యవస్థల్లో మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. తాజాగా దాడి జరిగిన చర్చి ఒడెస్సాలోనే అతి పెద్దది. దీనిని 1809లో వినియోగంలోకి తీసుకొచ్చారు. 1939లో సోవియట్ యూనియన్ దీనిని ధ్వంసం చేసింది. ఆ తర్వాత 2003లో పునరుద్ధరించారు. తాజాగా జరిగిన దాడిలో చర్చ బాగా దెబ్బతిందని తెలుస్తోంది.
అయితే ఒడెస్సాల్లోని సాంస్కృతిక నిర్మాణాలపై దాడులు చేయవద్దని ఐరాసకు చెందిన యునెస్కో రష్యాకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ, మాస్కో మాత్రం అవేమీ పట్టించుకోవడంలేదు. తాజాగా ఒడెస్సాపై దాడికి ఐదు రకాల క్షిపణులను వాడినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. తాజాగా శనివారం రాత్రి జరిగిన దాడుల్లో ఒకరు మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. వీరిలో పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. గత వారం నుంచి రష్యా దళాలు దాడులను తీవ్రం చేయడంతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యా చాలావరకు దాడులను నల్లసముద్రం పై నుంచి చేస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాల నుంచి మరిన్ని క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థలను అందించాలని కోరుతోంది. గత సోమవారం ఐరాస మద్దతు ఉన్న ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి రష్యా వైదొలగిన నాటి నుంచి ఉక్రెయిన్పై దాడులు తీవ్రతరం చేసింది. గత వారం నుంచి రష్యా దాడుల్లో దాదాపు 60,000 టన్నుల ధాన్యాలు ధ్వంసం అయ్యాయి. ప్రపంచ దేశాలకు ధాన్యం రవాణాలో ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్టు చాలా కీలకమైంది.
Related News
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హ్యారీ పోటర్ కోట ధ్వంసం
హ్యారీ పోటర్ సిరీస్ లో ఓ భారీ కోట అందరికి తెలిసే ఉంటుంది. ఆ భవనం ఉక్రెయిన్లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడు ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా నాశనం అయింది. ఈ విద్యా సంస్థ భవనంపై రష్యన్ క్షిపణి దాడి చేసింది.