AMRUT Scheme : ఏపీలో అమృత్ పథకానికి రూ.397 కోట్లు కేటాయిస్తు ఉత్తర్వులు జారీ
AMRUT Scheme : ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీటిని అందించడం, నీటి సరఫరా లోతైన ప్రాంతాల్లో సమస్యలు తీర్చడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.
- Author : Sudheer
Date : 25-05-2025 - 7:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి (AP Govt) చెందిన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రజలకి తీపికబురు. అమృత్ 2.0 (AMRUT 2.0) పథకాన్ని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.397 కోట్లను కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.
Tollywood : టాలీవుడ్ పెద్దలు కావాలని కష్టాలు కొనితెచ్చుకుంటున్నారా..?
పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు ముఖ్యంగా వేసవికాలంలో తాగునీటి కొరతతో బాధపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం త్వరితగతిన ఈ చర్యలు చేపట్టింది. మిషన్ మోడ్లో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి బలమైన తోడ్పాటుగా నిలవనుంది. పురపాలక శాఖ రెండు జీవోలు (GOs) విడుదల చేయడం ద్వారా పథకానికి మరింత గాధానాన్ని తీసుకొచ్చింది.
అమృత్ 2.0 పథకం కింద రాష్ట్రంలోని వివిధ పట్టణ స్థానిక సంస్థల పరిధిలో తాగునీటి వృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీటిని అందించడం, నీటి సరఫరా లోతైన ప్రాంతాల్లో సమస్యలు తీర్చడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ చర్యల ద్వారా ప్రజలకు నాణ్యమైన నీరు అందడం ఖాయమవుతుంది. ప్రభుత్వ ఈ నిర్ణయం ప్రజలకు భారీగా ఉపశమనం కలిగించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.