Restaurants: రెస్టారెంట్లపై ఓమిక్రాన్ ఎఫెక్ట్..?
ఒమిక్రాన్ వేరియంట్ హోటల్, రెస్టారెంట్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్ లో సెంకడ్ వేవ్ తరువాత హోటల్ పరిశ్రమ తిరిగి నెమ్మదిగా పుంజుకుంది.
- By Hashtag U Published Date - 06:30 AM, Sun - 30 January 22
ఒమిక్రాన్ వేరియంట్ హోటల్, రెస్టారెంట్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్ లో సెంకడ్ వేవ్ తరువాత హోటల్ పరిశ్రమ తిరిగి నెమ్మదిగా పుంజుకుంది. నవంబర్, డిసెంబరులో కాస్త మెరుగుపడుతుండగా.. ఓమిక్రాన్ ముప్పు ఇప్పుడు ఆశలను దెబ్బతీసిందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) హైదరాబాద్ చాప్టర్ హెడ్ శంకర్ కృష్ణమూర్తి అన్నారు.ఏదేమైనా మళ్లీ మార్చి నాటికి పరిస్థితి మెరుగుపడుతుందని..
చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రెస్టారెంట్ యాజమాన్యానికి ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. హోటళ్లు, రెస్టారెంట్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రయత్నాల్లో భాగంగా హోటళ్ల వ్యాపారులు ఎన్ఆర్ఏఐ హైదరాబాద్ చాప్టర్ను ఏర్పాటు చేశారు, దీనిని పరిశ్రమలు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు.పరిశ్రమ యొక్క అనిశ్చిత పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని.. NRAI వంటి ప్రతినిధి సంస్థ ప్రభుత్వం నిమగ్నమై సహాయం అందించడానికి మెరుగైన వేదికను అందిస్తుందని జయేష్ రంజన్ అన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో భారీ వనరులను అందిస్తున్నప్పటికీ రెస్టారెంట్ వ్యాపారం ఒక పరిశ్రమగా గుర్తించబడలేదని కో-చాప్టర్ హెడ్ సంపత్ తుమ్మల అన్నారు. సినిమా పరిశ్రమ కంటే ఈ పరిశ్రమ చాలా ఎక్కువ దోహదపడుతుంది.. అయితే ఇది ఇప్పటికీ అసంఘటిత రంగంగా పరిగణించబడుతుందని ఆయన తెలిపారు. NRAI హైదరాబాద్ చాప్టర్ గ్లోబల్ బ్రాండ్ల పెట్టుబడులను నగర స్థాయికి అనుగుణంగా సులభతరం చేస్తుందని, అలాగే స్థానిక బ్రాండ్లు గ్లోబల్గా వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని తుమ్మల సంపత్ అన్నారు. హైదరాబాద్లోని రెస్టారెంట్ల వ్యవస్థీకృత మార్కెట్ వాటా దాదాపు రూ. 6,037 కోట్లుగా ఉందన్నారు.
Related News
Vizag : వైజాగ్లో హోటల్స్పై విజిలెన్స్ అధికారుల తనిఖీలు.. నిల్వ ఉంచిన ఆహారాన్ని..?
వైజాగ్లోని హోలళ్లపై విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి. స్వరూపా రాణి