Summer Effect: అయ్యబాబోయ్.. ఎండవేడికి మనుషులే కాదండోయ్ రైలు పట్టాలు కూడా కరిగిపోతున్నాయ్?
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎక్కడ చూసినా కూడా ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే భయపడి
- By Nakshatra Published Date - 05:45 PM, Sun - 18 June 23
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎక్కడ చూసినా కూడా ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే భయపడిపోతున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడి తాళలేక ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే ఆలోచిస్తున్నారు. ఉదయం 7 8 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేవలం ఎండలు మనుషులపైనే కాకుండా రైలు పట్టాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని నిగోహన్ రైల్వే స్టేషన్ లో ఎండ వేడికి రైలు పట్టాలు కరిగిపోయాయి. నిగోహన్ రైల్వే స్టేషన్ లో లూప్ లైన్ లోనే రైల్వే ట్రాక్స్ ఎండలకు కరిగిపోయాయి. తాజాగా శనివారం రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ట్రాక్ మీద వెళ్తున్న రైలు త్రుటిలోనే ప్రమాదం నుంచి తప్పించుకుంది. అటుగా వస్తున్న నిలాంచల్ ఎక్స్ప్రెస్ నిగోహన్ రైల్వే స్టేషన్ లో మెయిన్ లైన్ కాకుండా లూప్ లైన్ లోకి వెళ్ళింది. శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ లూప్ లైన్ లోకి వెళ్ళగా అక్కడ ఎండలతో తీవ్రంగా వేడెక్కి ఉన్న పట్టాలు కరిగిపోవడం మొదలయ్యింది.
దాంతో పట్టాలు వెడల్పుగా మారాయి. మరొకవైపు రైల్వే పట్టాలు వెడల్పుగా మారుతుండడంతో రైలు చక్రాలు పట్టాలు తప్పేందుకు సిద్ధంగా ఉంది. అది గమనించిన లోకో పైలెట్ వెంటనే ట్రైన్ ను నిలిపివేశాడు. అనంతరం కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాడు. వెంటనే ఇంజినీరింగ్ సెక్షన్ ఉద్యోగులు అక్కడికి చేరుకొని సమస్యను గుర్తించి ట్రాక్ రిపేరు చేశారు. ఆ తర్వాత లక్నో జంక్షన్ చేరుకున్న లోకో పైలట్ ఈ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఆ విషయంపై స్పందించిన రైల్వే డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు ఉద్యోగులు డ్యామేజ్ అయిన ట్రాక్స్ ని పరిశీలించారు. రిపేర్ చేయాలని వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
Related News
Uttar Pradesh: ఇద్దరు యువకులతో మహిళ డాక్టర్ రాసలీలలు
ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా వైద్యురాలు ఇద్దరు మగ స్నేహితులతో కలిసి ఓ హోటల్లో పట్టుబడింది. సదరు మహిళా వైద్యురాలిని తన భర్త అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నాడు.