Odisha Train Accident: సీబీఐ దూకుడు…ఆ రైల్వే స్టేషన్లో రైళ్ల నిలుపుదల నిషేధం
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న రైల్వే స్టేషన్ లో ఏ రైలు ఆగకూడదని నిర్ణయించారు.
- Author : Praveen Aluthuru
Date : 10-06-2023 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
Odisha Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న రైల్వే స్టేషన్ లో ఏ రైలు ఆగకూడదని నిర్ణయించారు. తదుపరి ఆదేశాల వచ్చే వరకు బహంగా బజార్ రైల్వే స్టేషన్లో ఏ రైలు ఆగదని సౌత్-ఈస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) శనివారం తెలిపారు. రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు సంస్థ బహంగా రైల్వే స్టేషన్ను నిరంతరం సందర్శిస్తోంది. అటువంటి పరిస్థితిలో సిబిఐ విచారణ ముగిసే వరకు బహంగా స్టేషన్ న్లో ఏ రైలును ఆపడం నిషేధించబడింది.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. శుక్రవారం ఇద్దరు సభ్యుల సీబీఐ బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. దీని తర్వాత వివిధ ప్రాంతాల నుంచి కొన్ని ముఖ్యమైన ఆధారాలు కూడా సేకరించారు. (Odisha Train Accident)
శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు సీబీఐ (CBI) బృందం ప్రమాద స్థలానికి చేరుకుంది. దీని తర్వాత టీమ్ అక్కడి నుంచి ప్యానల్ రూమ్కి వెళ్లింది. ఇక్కడ కూడా అధికారులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఆ తర్వాత రిలే గదిని కూడా పరిశీలించారు. స్టేషన్లో ఉన్న వివిధ కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను కూడా సీబీఐ స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు పలు కీలకమైన రికార్డు డాక్యుమెంట్లను సేకరించారు. బహంగా స్టేషన్ లోపల ఉన్న ప్రైవేట్ నంబర్ ఎక్స్ఛేంజ్ పుస్తకాన్ని దర్యాప్తు సంస్థ పరిశీలించింది. చివరకు సీబీఐ బృందం రిలే గది, ప్యానెల్ గది మరియు డేటా లాకర్ను సీలు చేసింది.
Read More: CBN Politics : మళ్లీ పాత కథ! పరాయి వాళ్లకు రెడ్ కార్పెట్!